Breaking : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల!

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది APPSC. మొత్తం 81 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులకు అవకాశం ఇవ్వనుంది. మార్చి 17న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.

New Update
Breaking : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల!

APPSC Group-1 Notification : ఉద్యోగార్ధులకు వరుస పెట్టి గుడ్‌న్యూస్‌లు చెబుతోంది ఏపీ సర్కార్‌. నిన్న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ రిలీజ్ చేయగా.. ఇవాళ తాజాగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అవును..! ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది APPSC. మొత్తం 81 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొత్తం 81 ఖాలీలను APPSC భర్తీ చేయనుంది. ప్రభుత్వంలోని వివిధ పరిపాలనా పొజిషన్స్‌ను ఇవి కవర్ చేస్తాయి. అభ్యర్థులు ఈ పోస్టుల కోసం జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. గ్రూప్-1 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17న జరగనుంది. అందుబాటులో ఉన్న స్థానాల్లో, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో, సమర్థవంతమైన పాలనను నిర్ధారించడంలో కీలకమైన డిప్యూటీ కలెక్టర్ పాత్ర కోసం 9 ఖాళీలు ,డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) 26 ఖాళీలు ఉన్నాయి.

నిన్న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల:

WATCH:

ఏపీ(AP) యువత, విద్యార్థులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేష‌న్ ఎట్టకేలకు నిన్న విడుదలైంది. పోటీ పరీక్షల కోసం చాలాకాలంగా సాధన చేస్తున్న అభ్యర్థులకు జగన్‌ ప్రభుత్వ ఈ నిర్ణయం ఉత్సాహాన్నిచ్చింది. ముందుగా చెప్పినట్టుగానే పెద్దసంఖ్యలో గ్రూప్‌ 2 (Group 2) ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ (APPSC) నుంచి నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 897 పోస్టుల‌తో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ప్రకటించిన మొత్తం 897 పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, మిగతా 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిసెంబ‌ర్ 21 నుంచి జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నియామకాలను వేగవంతంగా పూర్తిచేస్తామని ముందునుంచి చెప్తున్నట్టుగానే, పరీక్షల తేదీలను కూడా నోటిఫికేషన్‌లోనే ప్రకటించారు.

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండు దశల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హులు. పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

Also Read: ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala High Alert :  పహల్గాంలో ఉగ్రదాడి..తిరుమలలో హై అలర్ట్

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు.

New Update
Tirumala High Alert

Tirumala High Alert

Tirumala High Alert :  జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు. కొండపై భద్రతను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం దాడి నేపథ్యంలో తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
కొండపై సెక్యూరిటీ కట్టుదిట్టం చేసినట్లు  టీటీడీ వెల్లడించింది. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను, భక్తులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజీని సైతం వదలకుండా తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలలోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నిఘవర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమలలో కూడా భద్రత కట్టుదిట్టం చేసింది.

 

 


 Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వచ్చే రెండు మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు నడకమార్గం ఉంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి సప్తగిరి చెకింగ్ పాయింట్ దగ్గర తనిఖీలు చేస్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలో వెళ్లే భక్తుల లగేజీని కూడా చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండటం, కాశ్మీర్ ఉగ్రదాడితో తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించారు.. దేశంలో మరోసారి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో తిరుమలలో భద్రతలను కట్టుదిట్టం చేశామన టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే
 
మరోవైపు ఆక్టోపస్‌ దళం కూడా అప్రమత్తమైంది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి.. భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆక్టోపస్ టీమ్ తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ చేసింది. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భ‌ద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరిస్తారు. గతేడాది మార్చిలో తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే తిరుమల ఆలయం దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.. 24 గంటలు సాయుధ బలగాల పహారాలో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. మొత్తం మీద కాశ్మీర్ ఉగ్రదాడి ప్రభావం తిరుమలపై కూడా కనిపించింది.. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment