TG TET: టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. లాస్ట్ మినిట్ టిప్స్!

తెలంగాణలో నేటి నుంచి టెట్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. పేపర్I, పేపర్II రాసే టీచర్ అభ్యర్థులకు నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. జనవరి 20 వరకు జరిగే పరీక్షల ప్రిపరేషన్, ఆన్సర్ చేసే విధానంలో జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఆ టిప్స్ కోసం పూర్తి ఆర్టికల్ చదవండి.

New Update
TET

TELANGANA TET EXAM

TG TET: తెలంగాణలో నేటి నుంచి టెట్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. పేపర్ I, పేపర్ II రాసే టీచర్ అభ్యర్థులకు నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. జనవరి 20 వరకు ఈ పరీక్షలు జరగనుండగా ప్రిపరేషన్, ఆన్సర్ చేసే విధానంలో జాగ్రత్తగా ఉండాలని, అందుకోసం ఈ ఆర్టికల్‌లో సూచించిన టిప్స్ ఫాలో కావాలంటున్నారు. 

ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు.. 

ఈ మేరకు టెట్ పరీక్ష జనవరి 2న ప్రారంభమై 20న ముగుస్తుంది. 10 రోజుల పాటు 20 సెషన్లలో ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయి. ప్రతి రోజు పరీక్ష రెండు సెషన్స్ ఉంటాయి. మొదటి సెషన్ ఉదయం 9:00 నుంచి 11:30 వరకు. రెండో సెషన్ 2 మధ్యాహ్నం 2:00 నుండి 4:30 వరకు నిర్వహిస్తున్నారు. టెట్ అర్హత సాధించడానికి జనరల్ కేటగిరీకి 60% మార్కులు, BC కేటగిరీకి 50%, SC, ST, వికలాంగ అభ్యర్థులకు 40% మార్కులు రావాలి. 

ఇది కూడా చదవండి: BCCI: చివరి టెస్టు నుంచి రోహిత్ ఔట్.. కోహ్లీకే మళ్లీ కెప్టెన్సీ!

ఇక పరీక్షకు వెళ్లేటప్పుడు హాల్ టికెట్ ప్రింట్ అవుట్ తప్పనిసరి. మీ హాల్ టికెట్‌పై ఇచ్చిన సూచనలు లేదా మార్గదర్శకాల‌ను సరి చూసుకోండి. ఒక పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫొటో, ఏదైనా ఐడి కార్టు (ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్) తీసుకుకెళ్లాలి. ఆన్ లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆప్షన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అందుకు తెలిసిన ప్రతి ప్రశ్నకు సమాధానం పెట్టండి. ఏ ఒక్క ప్రశ్నను కూడా వదిలేయద్దు. ఇక పేపర్-I అభ్యర్థులు 1 నుంచి 5 తరగతి పిల్లలకు బోధిస్తారు. పేపర్-II అభ్యర్థులు VI నుంచి VIII తరగతులకు క్లాసులు చెబుతారు. 

 

ఇది కూడా చదవండి: Freebies: ఉచితాలపై ఆధారపడొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment