Andhra Pradesh: వైసీపీ అధినేత జగన్‌పై నాగబాబు ఫైర్..

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై.. జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. కోపమొస్తే ఈవీఎంలు పగలగొడతారా అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మిడిమిడి జ్ఞానంతో మితిమీరీన ఏచ్చులకి పోయినందుకే పదకొండుకే ప్రజలు పరిమితం చేశారంటూ ఎద్దేవా చేశారు.

New Update
Andhra Pradesh: వైసీపీ అధినేత జగన్‌పై నాగబాబు ఫైర్..

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై.. జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. కోపమొస్తే ఈవీఎంలు పగలగొడతారా అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కోపమొచ్చి పగలగొట్టే దాన్ని సమర్ధిస్తారా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ అన్యాయం జరిగి ఉంటే పోలీసు సిబ్బంది, ఎన్నికల అధికారులు చూసుకుంటారు కదా అంటూ ధ్వజమెత్తారు. మిడిమిడి జ్ఞానంతో మితిమీరీన ఏచ్చులకి పోయినందుకే పదకొండుకే ప్రజలు పరిమితం చేశారని అన్నారు. ఇప్పటికైనా మారకపోతే వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితం చేస్తారంటూ ఎద్దేవా చేశారు.

Also read: అత్యంత ఖరీదైన నగరాల్లో ‘హైదరాబాద్’ కి ఏ స్థానామో తెలుసా!

Advertisment
Advertisment
తాజా కథనాలు