పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. ఎన్నికల వరకూ ఇక అక్కడే!!

పవన్ మొత్తానికి మంగళగిరికి షిఫ్ట్ అవుతున్నట్లుగా సమాచారం. ఇక్కడి నుంచే పార్టీకి సంబంధించి కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన భావిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీని ఓడించే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్..

New Update
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. ఎన్నికల వరకూ ఇక అక్కడే!!

Janasena chief Pawan Kalyan shifted his Office to Mangalagiri from Hyderabad: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు  ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి . దీంతో మాటలకు కూడా పదును పెరుగుతోంది.  వ్యక్తిగత అంశాలను కూడా నేతలు విస్మరించటం లేదు.   వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress) , తెలుగు దేశం(Telugu Desham), జనసేన పార్టీలు(Janasena Party) నువ్వా నేనా అనే విధంగా పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి.

ఈ  నేపథ్యంలో  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆయన ఫోకస్ మొత్తం ఆంధ్ర ప్రదేశ్ మీద పెట్టినట్లు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు తీవ్రంగా వ్యూహాలు రచిస్తున్నారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్ పైనే హాట్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అదే విధంగా వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ కి కూడా దీటుగా సమాధానాలు  ఇస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు పవన్ పై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ ను నాన్ లోకల్ అని విమర్శిస్తున్న తరుణంలో ఆ విమర్శలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

రాష్ట్ర ప్రజలకు అతి చేరువలో ఉండాలని  పవన్ కళ్యాణ్  నిర్ణయం తీసుకున్నారు.  పవన్ తన మకాన్ని  మంగళగిరికి  మార్చనున్నారని  సమాచారం. ఇక్కడి నుంచే పార్టీకి సంబంధించి కార్యకలాపాలు కొనసాగించాలని భావిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీని ఓడించే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్.. ఇకపై మంగళగిరి నుంచి నిర్వహించబోతున్నారట.

అలాగే కేంద్ర కార్యాలయ సిబ్బంది, ఫైల్స్, ఇతర విభాగాలు, కంప్యూటర్లను కూడా మంగళగిరికి తరలించినట్లు తెలుస్తోంది. పవన్ మంగళగిరిలోనే బస చేయబోతున్నారట. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌ కు అనుగుణంగా ఇంటి నిర్మాణం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా పనులు, సినిమా షూటింగ్ షెడ్యూల్ లో మాత్రమే పవన్ హైదరాబాద్ వెళ్లనున్నారని సమాచారం. ఎవరైనా పవన్ తో సినిమాలకు సంబంధించిన చర్చలు జరపాలన్నా మంగళగిరికే వస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్రను పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్.. మూడో విడతకు సంబంధించిన షెడ్యూల్‌ పై పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

Also Read: పోటాపోటీగా అంబటి వర్సెస్ జన సైనికులు.. సినిమాలపై రగడ

Advertisment
Advertisment
తాజా కథనాలు