Rishi Sunak: రిషి సునాక్‌కు బ్యాట్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ .. దానిపై ఎవరి సంతకం ఉందంటే..

యూకే పర్యటన చేస్తున్న కేంద్ర మంత్రి ఎస్‌ జైశంకర్.. తన భార్యతో కలిసి ఆ దేశ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసానికి వెళ్లారు. ప్రధాని మోదీ తరఫున సునాక్‌కు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గణపతి విగ్రహాన్ని, విరాట్‌ కొహ్లీ సంతకంతో ఉన్న ఓ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.

New Update
Rishi Sunak: రిషి సునాక్‌కు బ్యాట్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ .. దానిపై ఎవరి సంతకం ఉందంటే..

ప్రస్తుతం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ యూకేలో పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన యూకే ప్రధాని రిషి సునాక్‌ను కలిశారు. తన భార్య కోక్యతో కలిసి ఆదివారం యూకే ప్రధానమంత్రి అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లారు. సునాక్ దంపతులు వారికి స్వాగతం పలికారు. ఇక మంత్రి జైశంకర్ ప్రధాని మోదీ తరపున సునాక్‌ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ గణపతి విగ్రహాన్ని అలాగే.. ఇండియన్ స్టార్ క్రికెట్‌ ప్లేయర్ విరాట్ కొహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను సునాక్‌గా గిఫ్ట్‌గా ఇచ్చారు.

Also read: దాడులు మొదలెట్టిన హిజ్బుల్లా గ్రూప్..7గురు ఇజ్రాయెల్ సైనికులకు గాయాలు

అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలను యూకే ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్(ట్విట్టర్‌)లో పోస్టు చేసింది. ప్రపంచంలో ఉన్న భారతీయులందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పినట్లు రాసుకొచ్చింది. అలాగే మంత్రి జై శంకర్‌ కూడా తమకు ఆథిత్యం ఇచ్చిన సునాక్ దంపతులకు ధన్యవాదాలు చెబుతూ తన ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ఇదిలా ఉండగా.. జైశంకర్ యూకేలో నవంబర్‌ 15 వరకు పర్యటన చేయనున్నారు. ఆ దేశ విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నట్లు సమాచారం.

Also Read: సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులు సేఫ్.. అధికారుల కీలక ప్రకటన..

Advertisment
Advertisment
తాజా కథనాలు