PAK vs IRAN : ఇరాన్‌-పాక్‌ మధ్య యుద్ధ మేఘాలు.. ఇస్లామాబాద్‌లో హై అలెర్ట్!

ఇరాన్‌-పాక్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని జైష్‌ అల్‌ అదిల్‌ ఉగ్రస్థావరాలపై ఇరాన్‌ దాడి చేయగా.. ఇరాన్‌లోని బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ స్థావరాలపై పాక్‌ ప్రతిదాడి చేసింది. అటు పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో హై అలెర్ట్ ప్రకటించారు.

New Update
PAK vs IRAN : ఇరాన్‌-పాక్‌ మధ్య యుద్ధ మేఘాలు.. ఇస్లామాబాద్‌లో హై అలెర్ట్!

Pakistan Vs Iran News : ఇరాన్‌(Iran) లోని వేర్పాటువాద మిలిటెంట్ల స్థావరాలపై పాకిస్థాన్ వరుస సైనిక దాడులకు పాల్పడటం, తాజాగా సరిహద్దు వెంబడి జరిగిన ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. మధ్యప్రాచ్యం, విస్తృత ప్రాంతంలో ఘర్షణలు విస్తరిస్తున్న సమయంలో పాకిస్థాన్(Pakistan), ఇరాన్ రెండూ ఈ వారంలో ఒకరి భూభాగంపై మరొకరు మిలిటెంట్లపై దాడి చేశాయి.

పాక్‌ ఏం చెబుతోంది?
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో 'మార్గ్ బార్ సర్మాచార్' అనే ఆపరేషన్‌లో భాగంగా తమ బలగాలు అత్యంత సమన్వయంతో కూడిన సైనిక దాడులను ప్రారంభించాయని ఇస్లామాబాద్(Islamabad) చెబుతోంది. ప్రాంతీయ స్వయంప్రతిపత్తి కోసం పోరాడుతున్న రెండు మిలిటెంట్ గ్రూపులైన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA), బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్(BLP) ఈ ఆపరేషన్లో లక్ష్యంగా చేసుకున్న స్థావరాలను ఉపయోగించుకున్నాయని తెలిపింది.

శాంతించండి.. శాంతించండి:
ఇరాన్ పై పాక్ జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. పాక్ జరిపిన వైమానిక దాడుల్లో నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను పెంచే చర్యలను మానుకోవాలని ఇరాన్‌ను పాకిస్థాన్ హెచ్చరించింది. బలూచిస్థాన్‌(Balochistan) లోని కొన్ని ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్ బుధవారం ఉదయం దాడి చేయగా.. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై పాక్ సైనిక దాడులు చేసింది.


ఇక ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం వహించేందుకు చైనా(China) ముందుకొచ్చింది. ఇరు పక్షాలు శాంతియుతంగా, సంయమనం పాటించి ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని చైనా భావిస్తోందని, ఇరుపక్షాలు కోరుకుంటే పరిస్థితిని తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. దౌత్యం, చర్చల ద్వారా వివాదాస్పద సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరాన్, పాక్‌కు తాలిబన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఇక ఇరాన్, ఇరాక్, పాకిస్థాన్ సంయమనం పాటించాలని టర్కీ చెబుతోంది. అటు ఇరాన్‌ ఏ సమయంలో ఎటు నుంచి దాడి చేస్తుందోనని పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌ అత్యంత అప్రమత్తంగా ఉంది.

Also Read: ఇరాన్ మీద పాకిస్తాన్ ప్రతీకార చర్యలు

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనా, ఆమె కూతురు, మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి.

New Update
Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి  తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికార దుర్వినియోగంతో అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనాతో పాటు 
ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరికొందరపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి హసీనాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.  

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

ఇక వివరాల్లోకి వెళ్తే.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహనా, బ్రిటీష్ ఎంపీ తులిప్‌ రిజ్వానా సిద్ధిక్‌, మరో 50 మందిపై అవినీతి నిరోధక కమిషన్ బంగ్లాదేశ్‌ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై పరిశీలన చేసిన కోర్టు.. అరెస్టు వారెంట్లు జారీ చేసిందని పలు మీడియా కథనాలు తెలిపాయి. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసినట్లు చెప్పాయి. మరోవైపు అక్రమంగా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై షేక్‌ హసీనా, ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరో 17 మందిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.   

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఢాకా శివారులో ఉన్న పుర్బాచల్‌లో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి లీజుకు సంబంధించిన అభియోగంపై ఏసీసీ తన దర్యాప్తు రిపోర్టును కోర్టుకు సమర్పించింది. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఢాకాలో ఇళ్లు ఉన్నప్పటికీ.. నివాసం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటం వల్ల ఇటీవల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.అయితే తాజాగా మరోసారి కోర్టు అరెస్టు వారెంట్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

 telugu-news | rtv-news | sheik-hasina | international

 

Advertisment
Advertisment
Advertisment