Iran Vs Israel : ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ల దాడి..ఆవి బాంబులు కాదు ఆటబొమ్మలన్న ఇరాన్

పశ్చిమాసియాలో మళ్ళీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. నిన్న తెల్లవారుఝామున ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లో పేలుళ్ళు సంభవించాయి. అయితే దీని మీద ఇరాన్ స్పందిస్తూ ఇజ్రాయెల్‌ కనుక దాడులకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అంది.

New Update
Iran Vs Israel : ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ల దాడి..ఆవి బాంబులు కాదు ఆటబొమ్మలన్న ఇరాన్

Iran Vs Israel War : ఇరాన్(Iran) సైనిక స్థావరాల మీద ఇజ్రాయెల్(Israel) దాడులకు పాల్పడింది. ఆదేశంలోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌లో డ్రోన్లతో అటాక్ చేసింది. ఈ దాడిలో హష్ద్ షాబీ బలగాలకు చెందిన మందుగుండు సామగ్రి గిడ్డంగి ధ్వంసమైంది. అలాగే, ట్యాంక్ ప్రధాన కార్యాలయం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ దాడుల్లో ఒకరు చనిపోగా, ఆరుగురు వ్యక్తు గాయపడ్డారు. ఇరాన్ పై ఇజ్రయెల్ఏ దాడులు చేసిందని అమెరికా ధృవీకరించింది. అయితే ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, టెహ్రాన్ మాత్రం దీని మీద ఇప్పటివరకు స్పందించలేదు.

అదే కనుక అయితే తీవ్ర పరిణామాలు తప్పవు..

మరోవైపు తమ మీద జరిగిన దాడుల మీద ఇరాన్ స్పందించింది. నిజంగా కనుక ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను చేసినట్లయితే ఫలితం అనుభవించక తప్పదని అంటోంది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తోంది. అమెరికా(America) పర్యటనలో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్(Hossein Amir-Abdollahian) ఈ దాడుల మీద మీడియాతో మాట్లాడారు. ప్ఉరస్తుతం ఇజ్రాయెల్ చేసిన దాడులు మాదేవానికి ఏం నష్టం కలిగించలేదు కాబట్టి మేము ప్రతిచర్యలకు దిగడం లేదని హోస్సేన్ అన్నారు. కానీ ఒకవేళ అది తమ దేవానికి తీవ్ర నష్టం కలిగించేది అయితే మాత్రం మా ప్రతి స్పందన చాలా వేగంగా, కఠినంగా ఉంటుందని తెలిపారు. దానికి వాళ్ళు పశ్చాత్తాపడాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు శుక్రవారం ఇజ్రాయెల్ ప్రయోగించిన డ్రోన్లు చిన్న పిల్లల ఆటబొమ్మల్లాంటివని హేళన చేశారు హొస్సేన్.

ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఇజ్రాయెల్..

ఈ నెల 13న మూడు వందలకు పైగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద విరుచుకుపడింది. అప్పటి నుంచి దానికి ప్రతీకార దాడులు చేయాలని ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఈ నేపథ్యలో ఇరాన్‌లో పేలుడు సంభవించగానే అవి ప్రతీకార దాడులేనని అందరూ భావించారు. అయితే, ఇరాన్‌ మాత్రం ఖండించింది. తమ గగనతలంలో కనిపించిన అనుమానాస్పద వస్తువులను యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ తుపాకులతో నేలకూల్చామని, ఆ సందర్భంగా పేలుళ్లు జరిగాయని పేర్కొంది. ఇజ్రాయెల్‌ కూడా తామే దాడి చేశామని అధికారికంగా ప్రకటించలేదు.

Also Read:Gold Rates: బాబోయ్ ఇలా పెరుగుతున్నాయేటీ..రోజురోజుకూ కొండెక్కుతున్న బంగారం ధరలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Taliban Government : పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి సంఘటనపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఖండించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది.

New Update
Taliban's

Taliban's

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. ఈ సంఘటనను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ భయంకరమైన సంఘటనపై స్పందించి ఖండించింది.


'జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని IEA విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తోంది. ఇటువంటి చర్యలు దేశభద్రతను దెబ్బతీస్తాయి' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహర్ బాల్ఖీ బుధవారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. అటు పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది అని దాడి జరిగిన దాదాపు 24 గంటల తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.

Also Read :  Vinay Narwal : ఈమెకు ఏం చెప్పి ఓదార్చుదాం..  కన్నీళ్లు పెట్టిస్తున్న హిమాన్షి వీడియో!

ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తాం

భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.  త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు.  పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం  తీర్చుకుంటామని.. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎక్కడ నక్కిన కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు.  ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేదే భారత్ నినాదమని తెలిపారు.  ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారన్న రాజ్ నాథ్ సింగ్...  ఈ చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, తెరవెనుక ఉన్న వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు.  తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు రాజ్ నాథ్ సింగ్.

Also Read :  BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు