Mynmar Earthquake: మయన్మార్ లో తరుచూ భూకంపాలు..అక్కడ భూమి కింద ఏముంది?

మయన్మార్ లో భూకంపం విలయం సృష్టించింది. భవనాలు, కట్టడాలు నేలకూలాయి. వందల మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనికి కారణం అక్కడి సగాయింగ్ ఫాల్ట్ అనే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అసలేంటీ సగాయింగ్ ఫాల్ట్? ఇది ఎలా ఉంటుంది?

New Update
floods

Mynmar Earthquake: మయన్మార్ లో భూకంపం అక్కడి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసేసింది. ఒక్కసారిగా మీద వచ్చి పడిన విపత్తుతో జనం చెల్లాచెదురు అయిపోయారు. వందల్లో ప్రాణాలు పోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మయన్మార్, బ్యాంకాక్ తో సహా చైనా, భారత్, వియత్నాం మరికొన్ని తూర్పు ఆసియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై 7.7, 6.4 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది. అన్నిటి కంటే ఎక్కువగా థాయ్ లాండ్, మయన్మార్ దేశాలు ప్రభావితం అయ్యాయి. భారీగా ఇక్కడ భవనాలు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 

Also Read: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

సగాయింగ్ ఫాల్ట్..

భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశాల్లో మయన్మార్ ఒకటి. ఇక్కడి భూగర్భంలో ‘‘టెక్టానిక్ ప్లేట్స్’’ క్రియాశీలత ఎక్కువగా ఉంది. భూకంప కేంద్రం సరిగ్గా మయన్మార్ కు మధ్యలో ఉంది. ఇది సగాయింగ్ ఫాల్ట్ దగ్గరలో ఉంది. ఇండియన్‌ టెక్టానిక్‌ ప్లేట్‌, బర్మా మైక్రోప్లేట్‌ల మధ్య ఉన్న ప్రాంతాన్నే సగాయింగ్ ఫాల్ట్ అంటారు. మయన్మార్ లో ఉన్న ఉన్న ఒక నగరం పేరు మీద దీన్ని ఇలా వ్యవహరిస్తున్నారు. భూమి పొరల అమరికల్లో తేడాలుండడాన్నే ఫాల్ట్ అంటారు. మయన్మార్ లో ఇది చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 1200 కిలో మీటర్ల మేర విస్తరించి ఉందని చెబుతున్నారు. 

Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు

భూగర్భం పోరల అమరికల వల్ల రెండు భూభాగాలు ఒకదానికి ఒకటి తగులూతూ ఉంటాయి. ఏడాదికి 11 మి.మీ నుంచి 18 మి.మీ వేగంగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇందులో 18 మి.మీ అంటూ చాలా ఎక్కు వని చెబుతున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగుతుండటం, కాలక్రమేణా భూగర్భంలో ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. ఇది మరీ ఎక్కువైతే భూమి పైన పగుళ్లు కూడా ఏర్పడతాయి. టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఘర్షణ కారణంగానే తరుచూ భూకంపాలు వస్తుంటాయి. ఇంతకు ముందు కూడా సగాయింగ్ ఫాల్క్ కారణంగా మయన్మార్ లో చాలా భూకంపాలు ఏర్పడ్డాయి.  ఇక్కడ ఎప్పుడూ 6 కంటే ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలే ఏర్పడుతున్నాయి. 1946లో 7.7 తీవ్రతతో రాగా.. 1956లోనూ 7.1 తీవ్రతతో భూమి కంపించింది. 1988లో షాన్‌లో, 2004లో కోకో ద్వీపంలో వచ్చిన బలమైన ప్రకంపనలతో వందలాది మంది చనిపోయారు. 2011లో టార్లేలో వచ్చిన భూకంపంలో 151 మంది ప్రాణాలు కోల్పోయారు,  2016లోనూ 6.9 తీవ్రత భూమి కంపించింది. ఇప్పుడు తాజాగా మయన్మార్ లో ఈరోజు 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇందులో వందల మంది ప్రాణాలు పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Also Read: భూకంపం ఎఫెక్ట్.. 100 దాటిన మృతుల సంఖ్య

today-latest-news-in-telugu | earth-quake

Also Read: Delhi: రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు మండిపాటు..సర్వీస్ ఛార్జీలపై ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Earthquake: పెను విషాదం.. 2700కు పెరిగిన భూకంప మృతులు

మయన్మార్‌లో సంభవించిన భూకంపం పెను విషాదం సృష్టించింది. దీనివల్ల ఇప్పటిదాకా 2,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లలో 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు 50 మంది ఉన్నట్లు తెలిపాయి.

New Update
Earthquake in Myanmar

Earthquake in Myanmar

మయన్మార్‌లో  సంభవించిన భూకంపం పెను విషాదం సృష్టించింది. ఈ భూప్రళయం ధాటికి మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ప్రమాదం వల్ల ఇప్పటివరకు కలిపి 2,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లలో 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు 50 ఉన్నట్లు తెలిపాయి.  మరో 4,521 మంది గాయపడ్డారని.. 441 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుతం సైనిక పాలన, అంతర్యుద్ధాలతో కొట్టుమిట్టాడుతున్న మయన్మార్‌లో గత వారం శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. 

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!

మయన్మార్‌, థాయ్‌లాండ్‌ అనేక బిల్డింగ్‌లు ఊగిపోయాయి. మరికొన్ని ధ్వంసమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ఇప్పటికీ రెస్క్యూ బృందాలు చేరుకోలేని ప్రభావిత ప్రాంతాలు ఉండటం కలకలం రేపుతోంది. దీనివల్ల శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే వివిధ దేశాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలను పంపిస్తున్నాయి. అయితే వీళ్లు అక్కడికి వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ, తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆటంకం కలిగిస్తున్నాయి.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, షెల్టర్  అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలాఉండగా ఇప్పటికే భారత్‌..ఆపరేషన్‌ బ్రహ్మ కింద మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. టెంట్లు,దుప్పట్లు,స్లీపింగ్ బ్యాగులు జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది. అటు అమెరికా,ఇండోనేషియా,చైనా కూడా అవసరమైన సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియా -గుటెరస్‌ వెల్లడించారు.

Also Read: బంగ్లాలో పడిపోతున్న వస్త్ర పరిశ్రమ..200లకు పైగా ఫ్యాక్టరీలు క్లోజ్

rtv-news | earthquake | myanmar earthquake

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు