Afghan: భారత్‌తో బలమైన సంబంధాలు కావాలి‌‌–ఆఫ్ఘాన్

భారత్‌తో సంబంధాలు తమకు చాలా ముఖ్యమైనదని అని చెబుతోంది ఆఫ్ఘాన్. వారి నుంచి ఆర్ధికంగా, ప్రాంతీయంగా కూడా చాలా అవసరమని చెబుతున్నారు. దుబాయ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీతో సమావేశమైన అనంతరం అఫ్గాన్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రి స్పందించారు.

New Update
india

India, Afghanistan Foreign Ministers

ప్రస్తుతం ఆఫ్ఘాన్ తాలిబాన్ పరిపాలనలో ఉంది. అప్పటి నుంచి ఎవరితో సంబంధం లేకుండా రూల్స్ పెడుతూ ఒకరకంగా నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది. 2021 నుంచి తాలిబాన్లు ఆఫ్ఘాన్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీని తరువాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆ దేశనేత భారత విదేశాంగ కార్యదర్శితో సమావేశమయ్యారు. ఈ ఉన్నతస్థాయి భేటీలో పలు అంశాలపై చర్చించారు. 

Also Read: చైనాలో మళ్లీ కొత్త వైరస్ కలకలం.. వెలుగు చూసిన కొత్త వేరియంట్

మా నుంచి ఎలాంటి ముప్పూ ఉండదు...

విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీతో సమావేశమైన అనంతరం అఫ్గాన్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ మీడియాతో మాట్లాడారు. ఇందులో భారత్‌తో తమ రాజకీయ, ఆర్ధిక సంబంధాలు మరింత మెరుగుకావాలని కోరుకుంటున్నామని ముత్తాఖీ చెప్పారు. భారత్ ఇప్పటికే తమకెంతో మానవతా సహాయం చేసింది...దానికి ధన్యవాదాలని అన్నారు. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, ప్రజా సంబంధాలపై తాజా భేటీలో చర్చించామన్న ఆయన.. అఫ్గాన్‌ నుంచి భారత్‌కు ఎటువంటి ముప్పు ఉండదని హామీ ఇస్తున్నామని ముత్తాఖీ హామీ ఇచ్చారు. మరోవైపు తమ విద్యార్థులకు భారత్ వీసాలను జారీ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Also Read: అమెజాన్ కొత్త సేల్.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లే ఆఫర్లు!

Also Read: పట్టపగలే యువతిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి పొడిచి! (వీడియో వైరల్)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment