UAE: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు

యూఏఈలో ఇద్దరు భారతీయులకు అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. మన విదేశాంగ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. బాధిత కుటుంబాలకు కూడా సమాచారం అందించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Death Sentence

Death Sentence

యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (UAE)లో ఇద్దరు భారతీయులకు అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. మన విదేశాంగ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. బాధిత కుటుంబాలకు కూడా సమాచారం అందించింది. ఉరిశిక్షకు గురైన వాళ్లని మహమ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్ పెరుమ్తట్టు వలప్పిల్‌గా గుర్తించారు. వీళ్లిద్దరూ కూడా కేరళకు చెందిన వారు కావడం విశేషం.  

Also Read: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే!

మహమ్మద్ రినాష్‌.. ఓ యూఏఈ వాసి హత్య కేసులో దోషిగా తేలాడు. అలాగే ఓ భారతీయుడిని హత్య చేసిన కేసులో మురళీధరన్ కూడా దోషిగా తేలాడు. దీంతో వీళ్లిద్దరికీ యూఏఈ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. వీళ్లకు అవరసరమైన దౌత్య, న్యాయం సాయం కూడా తాము అందజేశామని భారత విదేశాంగశాఖ తెలిపింది. 

Also Read:  పార్టీ మారనున్న నీతీశ్ కుమార్‌.. బిహార్‌ రాజకీయాల్లో పీకే సంచలనం!

ఇదిలాఉండగా.. యూఏఈ జైల్లో మరో భారతీయ మహిళ షెహజాది ఖాన్‌కు కూడా ఉరిశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే. తాను పనిచేసే యజమాని కొడుకు మరణానికి కారణం ఆమెనే అని కోర్టులో నిర్దారణ అయింది. దీంతో ఆమెకు ఉరిశిక్ష విధించారు. తన కూతురుని బలవంతగా నేరం ఒప్పుకునేలా చేశారని షెహజాది తండ్రి కూడా న్యాయపోరాటం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి ఫిబ్రవరి 15న ఆమెను ఉరి తీశారు. అయితే ముగ్గురు భారతీయులకు యూఏఈలో ఇలా ఉరిశిక్ష పడటం చర్చనీయాంశమవుతోంది.  

Also Read: తమిళనాడులో దారుణం.. కుటుంబాన్ని బలి చేసుకున్న రమ్మీ

Also Read: రాహుల్ గాంధీకి కోర్టు షాక్.. ఆ కేసులో రూ.200 జరిమానా.. ఎందుకో తెలుసా!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment