Donald Trump: అక్రమ వలసదారులపై ట్రంప్ సంచలన ప్రకటన..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. తాను తీసుకున్న చర్యల వల్లే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గిపోయాయని సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. తాను తీసుకున్న చర్యల వల్లే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గిపోయాయని సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో వాళ్లని స్వదేశాలకు పంపించిన సంగతి తెలిసిందే. ఈ  చర్యల వల్లే ఫిబ్రవరి నాటికి అక్రమ వలసదారుల సంఖ్య చరిత్రలోనే తక్కువ స్థాయిలో పడిపోయినట్లు ట్రంప్‌ తెలిపారు. అమెరికాపై అక్రమ వలసదారుల దండయాత్ర ముగిసినట్లు పేర్కొన్నారు. 

Also read: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !

ఫిబ్రవరిలో 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డట్లు తెలిపారు. జో బైడెన్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రతినెల అమెరికాలోకి 3 లక్షల మంది అక్రమంగా ప్రవేశించేవారని ట్రంప్ గుర్తు చేశారు. మొత్తంగా దేశంలో 95 శాతం వలసలు తగ్గినట్లు పేర్కొన్నారు. తన పాలనలో ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించాలని యత్నిస్తే భారీగా జరిమానాలు విధిస్తామన్నారు. అలాగే తక్షిణ బహిష్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.  

అయితే ట్రంప్‌ చేసిన ప్రకటనలను పలు వార్త సంస్థలు ఖండించాయి. జో బెడెన్‌ అధికారంలో ఉన్న చివరివారంలో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు చెప్పాయి. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాక మొదటివారంలో 7,287 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు తెలిపాయి. ట్రంప్ వచ్చాక కేవలం 65 శాతమే అక్రమ వలసలు తగ్గినట్లు చెప్పాయి. 

Also Read: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!

ఇదిలాఉండగా ఇటీవల అమెరికా నుంచి అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో పంపండం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. భారతీయులను కూడా వెనక్కి పంపించారు. భారత ప్రభుత్వం కూడా ట్రంప్ తీసుకున్న చర్యలకు మద్దతు పలికింది. అక్రమ వలసదారులకు తాము కూడా వ్యతిరేకమేనని పేర్కొంది. అయితే భారతీయులకు సంకెళ్లు వేసి తరలించడం దుమారం రేపింది. దీంతో కేంద్రం విజ్ఞప్తి మేరకు మహిళలకు, చిన్నారులకు సంకెళ్లు వేయకుండానే పంపించింది.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment