USA: వర్కౌట్ అయిన ట్రంప్ ఐడియా..ఒక్కరోజులోనే 1,000 గోల్డ్ కార్డులు సేల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఐడియా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సంపన్నులు తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ హిట్ కొట్టింది. ఒక్కరోజులోనే వెయ్యి కార్డులకు పైగా అమ్ముడుబోయింది.

author-image
By Manogna alamuru
New Update
usa

USA Gold Card

గోల్డ్ కార్డ్ స్కీమ్ కు మస్త్ గిరాకీ ఏర్పడింది. ఒక్కరోజులోనే 1000 గోల్డ్ కార్డులను విక్రయించామని ఈ మేరకు యూఎస్ కామర్స్ మినిస్టర్ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ప్రపంచ దేశాల సంపన్నులు అమెరికా గోల్డ్ కార్డ్ కోసం ఎగబడుతున్నారు. వీరందరూ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉండడమే కాకుండా ఇక్కడ సెటిల్ అయ్యేందుకు గోల్డ్ కార్డ్ ను పోటీ పడి మరీ కొంటున్నారు. అమెరికాలో ప్రసారమయ్యే ఆల్-ఇన్ పాడ్ కాస్ట్ లో కామర్స్ మినిస్టర్ హోవార్డ్ లుట్నిక్ ఈ విషయాన్ని తెలిపారు. ఒక్కో కార్డుకు 50 లక్షల డాలర్ల (రూ. 43 కోట్లు) చొప్పున మొత్తం 500 కోట్ల డాలర్ల(రూ. 43 వేల కోట్లు) ఆదాయం సమకూరిందని చెప్పారు. గోల్డ్ కార్డుల ద్వారా వచ్చిన డబ్బులతో అమెరికాకు ఉన్న అప్పులను కొంతమేర వరకు తగ్గించాలనే యోచనలో ఉన్నామని లుట్నిక్ తెలిపారు. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ అప్పులు ప్రస్తుతం 36 లక్షల కోట్ల డాలర్లు ఉన్నాయి. 

5 మిలియన్లకు గోల్డ్ కార్డ్..

ఈ గోల్డ్ కార్డుల ద్వారా అమెరికాకు ఫైనాన్స్ ఉన్న లోటును పూరిస్తామని ట్రంప్ ఇంతకు ముందే చెప్పారు.  సమారు ఒక మిలియన్ గోల్డ్ కార్డులు ఇస్తామని తెలిపారు. దీంతో వచ్చిన మొత్తంతో అమెరికాలో ఉద్యోగాలు సృష్టించవచ్చని వివరించారు. విదేశీ పెట్టుబడిదారులను శాశ్వత నివాసితులుగా మార్చడానికి అనుమతించే "EB-5" వలస పెట్టుబడిదారు వీసా కార్యక్రమాన్ని "గోల్డ్ కార్డ్"తో భర్తీ చేస్తామని ట్రంప్ చెప్పారు. దీని ద్వారా ధనవంతులు తమ దేశంలోకి వస్తారని అన్నారు. అమెరికాలో వ్యాపారం చేయాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా లేదా తొందరగా గ్రీన్ కార్డ్ రావాలంటే ఈబీ 5 వీసా ఉండాలి. దీని ద్వారా గ్రీన్ కార్డ్ చాలా తొందరగా వచ్చేస్తుంది. అంతేకాదు అమెరికా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఇది రష్యన్లతో సహా అన్ని దేశాల వారికీ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. EB-5 ప్రోగ్రామ్‌ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నామన్నారు ట్రంప్. చట్టబద్ధంగా రావాలనుకున్న ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. 

 today-latest-news-in-telugu | usa | trump | green-card citizenship

Also Read: India: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indus Waters : మిస్టర్ మోదీ..సింధూలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుంది: బిలావల్‌ భుట్టో హెచ్చరిక

పాక్‌ మాజీ విదేశాంగశాఖ మంత్రి బిలావల్‌ భుట్టో భారత్‌పై నోరు పారేసుకున్నారు. సుక్కూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..  తన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి భారత ప్రధాని మోదీ పాక్‌ను నిందిస్తున్నారని భుట్టో వాపోయారు.

New Update
modi-and-pak

modi-and-pak

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తూ భారత ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. పాక్ తో దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవడంతో పాటుగా సింధు జలాల రద్దు, పాక్ జాతీయులు వీసాలు రద్దు చేస్తూ కీలక ఆంక్షలు విధించింది. దీనిపై తీవ్రంగా స్పందిస్తూ భారత్‌పై నోరు పారేసుకున్నారు పాక్‌ మాజీ విదేశాంగశాఖ మంత్రి బిలావల్‌ భుట్టో. సుక్కూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..  తన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి భారత ప్రధాని మోదీ పాక్‌ను నిందిస్తున్నారని భుట్టో వాపోయారు.

Also read :  Heatwave Warning : బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త...ఈ రోజు మండనున్న ఎండలు..అరెంజ్‌ అలర్ట్‌

సింధూ పాక్‌దే

సింధూ పాక్‌దేనని, ఇకపై కూడా ఆ నదీ జలాలు తమకే చెందుతాయని వ్యాఖ్యనించారు. సింధూలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు.  పాకిస్తాన్ కు అతి పిన్న వయస్కుడైన విదేశాంగ మంత్రిగా కూడా పనిచేసిన బిలావల్..  ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు. పాకిస్తానీలు కూడా ఉగ్రవాద బాధితులుగా మిగిలిపోయారని అన్నారు. భారత దురాక్రమణ నుండి తమ నదిని రక్షించుకోవడానికి దృఢ సంకల్పంతో కూడిన పోరాటానికి సిద్ధం కావాలనితన మద్దతుదారులను కోరారు.

Also Read :  Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!

 

 

Advertisment
Advertisment
Advertisment