Bill Gates: భారత యువకులు అక్కడికి వెళ్లాలి.. బిల్‌ గేట్స్

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌ గేట్స్ భారత యువతకు కీలక సూచనలు చేశారు. యవత ఎక్కువగా ప్రయాణాలు చేయాలన్నారు. పేదవారు ఉండే ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలని చెప్పారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు.

New Update
Bill gates

Bill gates

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌ గేట్స్ భారత యువతకు కీలక సూచనలు చేశారు. యవత ఎక్కువగా ప్రయాణాలు చేయాలన్నారు. పేదవారు ఉండే ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలని చెప్పారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రపంచంలో భారత్‌ టాలెంట్ హబ్‌గా ఎందుకు మారుతుందనే దానిపై వచ్చిన ప్రశ్నకు బిల్‌ గేట్స్ బదులిచ్చారు. 

Also Read: ఆ బిడ్డకు తండ్రి లవరా? భర్తా? భర్తను చంపి డ్రమ్ములో వేసిన కేసులో బిగ్ ట్విస్ట్.. జైల్లో ప్రెగ్నెంట్!

'' భారతీయులు గొప్ప ప్రతిభావంతులు. సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. వాళ్ల ఆవిష్కరణలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. డిజిటల్ రంగంలో కూడా భారత్‌ దూసుకెళ్తోంది. ఆధార్ లాంటి సంబంధిత కార్యక్రమాలు దీనికి నిదర్శనం. అలాగే భారత్‌లో యువకులు ఎక్కువగా ప్రయాణాలు చేయాలి. పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్లి పరిశీలించండి. 

Also Read: ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్ యువతికి మత్తుమందు ఇచ్చి.. 23 మంది గ్యాంగ్‌రేప్

అక్కడుండే వారు ఎంతో తెలివైన వాళ్లు. కానీ వాళ్లకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. మంచి విద్య అందడం లేదు. వాళ్లకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీటిని భారత యువత గమనించాలని'' బిల్‌ గేట్స్ అన్నారు. అలాగే ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన తన ఆస్తికి సంబంధించిన విషయాలను కూడా పంచుకున్నారు. తన పిల్లలకు తాను కూడబెట్టిన ఆస్తిపై ఆధారపడకుండా వాళ్లు సొంతంగా సంపాదించుకోగలరనే నమ్మకం కలిగించారు. తాను సంపాదించిన మొత్తంలో 1 శాతం కంటే తక్కవ పిల్లలకు ఇస్తానని చెప్పారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌ ఎఫెక్ట్‌.. భారీగా పతనమైన భారత స్టాక్‌ మార్కెట్‌

rtv-news | bill-gates | india 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనా, ఆమె కూతురు, మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి.

New Update
Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి  తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికార దుర్వినియోగంతో అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనాతో పాటు 
ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరికొందరపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి హసీనాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.  

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

ఇక వివరాల్లోకి వెళ్తే.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహనా, బ్రిటీష్ ఎంపీ తులిప్‌ రిజ్వానా సిద్ధిక్‌, మరో 50 మందిపై అవినీతి నిరోధక కమిషన్ బంగ్లాదేశ్‌ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై పరిశీలన చేసిన కోర్టు.. అరెస్టు వారెంట్లు జారీ చేసిందని పలు మీడియా కథనాలు తెలిపాయి. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసినట్లు చెప్పాయి. మరోవైపు అక్రమంగా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై షేక్‌ హసీనా, ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరో 17 మందిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.   

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఢాకా శివారులో ఉన్న పుర్బాచల్‌లో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి లీజుకు సంబంధించిన అభియోగంపై ఏసీసీ తన దర్యాప్తు రిపోర్టును కోర్టుకు సమర్పించింది. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఢాకాలో ఇళ్లు ఉన్నప్పటికీ.. నివాసం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటం వల్ల ఇటీవల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.అయితే తాజాగా మరోసారి కోర్టు అరెస్టు వారెంట్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

 telugu-news | rtv-news | sheik-hasina | international

 

Advertisment
Advertisment
Advertisment