Pakistan: బస్సు మీద ఉగ్రవాదుల దాడి..50 మంది మృతి

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు దాడి చేశారు. కదులుతున్న బస్సుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఓ పోలీసు అధికారితో సహా 50 మంది మరణించారు. 

author-image
By Manogna alamuru
New Update
bus

Terrorists Attack on Bus: 

పాకిస్థాన్‎లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సులను లక్ష్యంగా చేసుకుని విచక్షణరహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో 50 మంది సామాన్య ప్రజలు మరణించారు. మరో 29 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. అంతేకాదు ఇందులో మహిళలు, పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఖుర్రం గిరిజన జిల్లాలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో  ఈ దాడి జరిగింది. పెషావర్ నుండి పరాచినార్‌కు, పరాచినార్ నుంచి పెషావర్‌‌కు వెళుతున్న రెండు బస్సుల ఉగ్రవాదులు మీద కాల్పులు జరిపారు.

Also Read: ఆ వీడియో చూపించి బాలికపై అత్యాచారం.. చివరికి ఏం జరిగిందంటే?

ఘటన జరిగిన వంటనే పోలీసులు అధికారులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన వారిలో 14 మందికి ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని, అందుకే వారిని ఇంకా గుర్తించలేదని వారి బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనను పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. మరోవైపు, అమాయక ప్రయాణీకులపై దాడి చేయడం పిరికితనం, అమానవీయ చర్య అని పీపీపీ పార్టీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక కాల్పుల మీద ఇప్పటివరకూ ఏ గ్రూపు బాధ్యత తీసుకోలేదు. 

Also Read: AP:  ఏపీలో ఎన్టీపీసీ 1, 87,00 కోట్ల ఒప్పందం..లక్షమందికి ఉద్యోగాలు

Also Read: అమెరికాలో సొంత తుపాకీ పేలి హైదరాబాద్‌ యువకుడి మృతి!

Also Read: తాగినోళ్లకు తాగినంత...మందుబాబులకు రేవంత్‌ సర్కార్‌ అదిరిపోయే ఆఫర్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment