Srilanka: శ్రీలంకలో ప్రధాని మోదీ.. 11 మంది భారత జాలర్లు విడుదల

శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు కుమార దిసనాయకేతో సమావేశం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా భారత్‌కు చెందిన 11 మంది జాలర్లను శ్రీలంక విడుదల చేసింది.

New Update
Pm Modi and Sri Lanka Releases 11 Indian Fishermen As Special Gesture

Pm Modi and Sri Lanka Releases 11 Indian Fishermen As Special Gesture

భారత్, శ్రీలంక మధ్య మత్స్యకారుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతుంటాయి. తమ జలాల్లోకి వచ్చారని భారత జాలర్లను శ్రీలంక నౌకదళ సిబ్బంది అరెస్టు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇటీవల ప్రధాని మోదీ తన శ్రీలంక పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య మత్స్యకారుల వివాదాలపై పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.  ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా భారత్‌కు చెందిన 11 మంది జాలర్లను శ్రీలంక విడుదల చేసింది. 

Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు కుమార దిసనాయకేతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యూఏఈతో కలిసి ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, పవర్‌గ్రిడ్ ద్వారా అనుసంధానత వంటి ఒప్పందాలు చేసుకున్నారు. శ్రీలంక నిర్బంధంలో ఉన్న భారత మత్స్యకారుల్ని అలాగే వాళ్ల పడవలను విడుదల చేయాలని ప్రధాని మోదీ కోరారు.   

అలాగే శనివారం దిసనాయకేతో కలిసి అనురాధపురలో జయశ్రీ మహాబోధిని సందర్శించారు. ఆ తర్వాత మహో ఒమన్‌తాయ్‌ల మధ్య అప్‌గ్రేడ్‌ చేసినటువంటి రైల్వే్లైన్‌ను దిసనాయకేతో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత భారత్‌కు బయలుదేరారు. శ్రీలంక పర్యటన ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తోందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 

Also Read: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!

ఇదిలాఉండగా శ్రీలంక నుంచి తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ విమానంలో నుంచే రామసేతును సందర్శించారు. ఎక్స్‌లో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. '' శ్రీలంక నుంచి వస్తుండగా రామసేతును దర్శించే భాగ్యం కలిగింది. అయోధ్యలో బాలరాముడికి సూర్య తిలకం జరిగినప్పుడే ఇది జరగడం విశేషం. ఈ రెండింటిని చూసే అదృష్టం నాకు దక్కిందని'' ప్రధాని మోదీ రాసుకొచ్చారు.

rtv-news | india | srilanka

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Earthquake: గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు.. భయాందోళనలో జనం

ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు వచ్చాయి. భారత్‌లో రెండు, మయన్మార్, తజికిస్తాన్‌లో ఒక్కోటి వచ్చాయి. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు.

New Update
Earthquake

Earthquake

ఈమధ్య వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనలో ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. మొదటి భూకంపం తజికిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు సమీపంలో రాగా.. ఆ తర్వాత మయన్మార్‌లో మీక్టిలాలో వచ్చింది. అనంతరం భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకశీలో భూకంపాలు వచ్చాయి.   

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. తజికిస్తాన్‌లో భూకంప తీవ్రత 6.0 గా నమోదయ్యింది. భారత్‌లో ఫైజాబాద్‌లో ఉదయం 9 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. కేవలం ఒక గంట వ్యవధిలోనే నాలుగు భూకంపాలు వచ్చాయి. మయన్మార్‌లో 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మార్చి 28న అక్కడ 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ బలమైన భూకంపం సంభవించడం కలకలం రేపింది. జనం ఇళ్ల నుంచి భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. 

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

 జమ్ముకశ్మీర్‌లో హిమాలయన్‌ ప్రాంతంలో 4.2 తీవ్రతో భూకంపం రావడంతో అక్కడి స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ భూకంపాలు భారత్‌ ప్లేట్‌ యూరేషియన్ ప్లేట్‌తో ఢీకోనడం వల్ల సంభవించే టెక్టోనిక్‌ కదలికల వల్ల సంభవిస్తున్నాయి. ఇదిలాఉడంగా మార్చి 28న మయన్మార్‌ వచ్చిన భూకంప ధాటికి 3600 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

telugu-news | rtv-news | earthquake | national-news

 

Advertisment
Advertisment
Advertisment