పార్లమెంట్‌లో అబద్ధాలు చెప్పిన ఎంపీపై కోర్టు సీరియస్.. రూ.9 లక్షలు ఫైన్!

ప్రవాస భారతీయుడు ప్రీతం సింగ్ సింగపూర్ పార్లమెంట్‌లో ఎంపీ. 2021లో ఆయన సొంత పార్టీ నేతపై అబద్ధాలు చెప్పాడని అభియోగాలు వచ్చాయి. దీంతో కమిటి విచారణ చేపట్టగా.. కోర్టు అతనికి 14వేల డాలర్లు జరిమానా విధించింది. ప్రీతమ్ సింగపూర్ వర్కర్స్ పార్టీ ప్రతిపక్ష నేత.

New Update
singapore mp

singapore mp Photograph: (singapore mp)

చట్టసభలో అబద్ధాలు చెప్పాడని ఓ పార్లమెంట్ సభ్యుడికి కోర్టు జరినామా విధించింది. భారత సంతతికి చెందిన ప్రీతం సింగ్ సింగపూర్ పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రీతమ్ సింగ్ పార్లమెంట్‌లో అసత్యాలు చెప్పారని 14 వేల డాలర్ల జరిమానా విధించింది అక్కడి న్యాయస్థానం. సింగపూర్ వర్కర్స్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రీతమ్ సింగ్ ఆ పార్టీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యురాలు రయీసా ఖాన్‌పై 2021లో అసత్య వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆ ఆరోపణలపై ప్రివిలేజెస్ కమిటీ విచారణ చేసింది.

Also Read: Canada: అవసరమైతే ఉక్రెయిన్‌ కి మా బలగాలు పంపుతాం: కెనడా ప్రధాని!

Also Read : ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?

ప్రీతమ్ సింగ్ రెండుసార్లు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని అభియోగాలు వచ్చాయి. దీనిపై నాలుగు నెలలు విచారణ చేశారు. చివరికి ప్రీతం సింగ్ పార్లమెంట్‌లో చెప్పినవి అబద్ధాలని తేలింది. ఆయనకు రెండు సార్లు అసత్యాలు చెప్పినందుకు 14వేల డాలర్లు జరిమానా వేసింది సింగపూర్ లోకల్ కోర్ట్. ఆయనపై రెండు కేసులు నమోదైయ్యాయి. ఒక్కో కేసులో 7వేల డాలర్ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సింగపూర్ రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా ఓ కేసులో సంవత్సరం జైలు శిక్ష లేదా 10వేల జరిమానా పడితే ఎంపీగా పోటీ చేయడానికి అనర్హుడు. అయితే ఈ రూల్ కింద ప్రీతం సింగ్ అనర్హుడు కాడని ఎన్నికల అధికారులు చెప్పారు. దీంతో 2025 నవంబర్‌లో జరిగే సింగపూర్‌లో ప్రీతం సింగ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA-China: ట్రంప్ కు చైనా షాక్..బోయింగ్ విమానాలు బంద్

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఒకరి మీద ఒకరు సుంకాలతో దాడులు చేసుకున్నారు ఇంతవరకూ. ఇప్పుడు చైనా ఏకంగా బోయింగ్ జెట్ విమానాల దిగుమతిని ఆపేసి ట్రంప్ కు షాక్ ఇచ్చింది. 

New Update
china

Boing Jets

అమెరికా, చైనాలు పగబట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ట్రంప్ మొదలెట్టిన వాణిజ్య యుద్ధం తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. మొన్నటి వరకు సుంకాలతో దాడులు చేసుకున్న రెండు దేశాలు ఇప్పుడు మరో అడుగు ముందు వేస్తున్నాయి. అమెరికా ఆధిపత్యాన్ని చైనా ఎంత మాత్రం ఒప్పుకునేది లేదని చెబుతోంది. చర్చలకు తాము సిద్ధమంటూనే అమెరికాకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా పెద్ద షాకే ఇచ్చింది చైనా. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే బోయింగ్ జెట్ విమానాలను ఆపేసింది. వాటిని డెలివరీ తీసుకోవద్దని చైనా ఎయిర్ లైన్స్ కు అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని బ్లూమ్ బర్గ్ న్యూస్ చెబుతోంది. అలాగే అమెరికన్‌ కంపెనీల నుంచి విమానాల విడిభాగాలు, పరికరాల కొనుగోలును కూడా ఆపేయాలని నిర్దేశించింది. 

మార్కెట్లు మటాష్..బోయింగ్ షేర్లు డౌన్..

అమెరికా టారీఫ్ లను విపరీతంగా పెంచేయడమే దీనికి కారణమని చైనా చెబుతోంది. దీంతో బోయింగ్‌ విమానాలను లీజుకు తీసుకుని విమానయాన సంస్థలకు ఆర్థికంగా ఊతమివ్వాలని చైనా యోచిస్తోంది. బోయింగ్ అమెరికాకు చెందిన అతిపెద్ద విమాన తయారీ సంస్థ. ఇందులో 30శాతం వరకూ చైనానే కొంటోంది. కానీ ఇప్పుడు సుంకాలు పెంచేయడంతో బోయింగ్ విమానాలు కానీ, వాటి విడి భాగాలు కానీ దిగుమతి చేసుకుంటే విమానయాన సంస్థలకు తడిసిమోపెడవుతోంది. తాజా చైనా నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ ను ప్రభావితం చేసింది. దీని కారణంగా బోయింగ్ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. 

today-latest-news-in-telugu | usa | china | donald trump tariffs | boing | airplanes

 

Also Read:  AP: మూడు సిటీలు కలిపి మెగా సిటీ..చంద్రబాబు మాస్టర్ ప్లాన్

 

Advertisment
Advertisment
Advertisment