Sam Altman: నా సోదరి పరువు తీసింది.. శామ్‌ ఆల్ట్‌మన్‌ సంచలన ఆరోపణలు

ఓపెన్ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లపాటు లైంగికంగా వేధించాడని అతనిపై తన సోదరి చేసిన ఆరోపణలకు తీవ్రంగా ఖండించారు. ఆర్థిక సాయాన్ని పొందాలనే కుట్రతో తన సోదరి ఇలా తనపై తప్పుడు వాదనలు చేసిందని ఆరోపించారు.

New Update
Open AI CEO Sam Altman

Open AI CEO Sam Altman

ఓపెన్ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు పదేళ్లపాటు లైంగికంగా వేధించాడని అతనిపై తన సోదరి చేసిన ఆరోపణలకు తీవ్రంగా ఖండించారు. ఇవ్వన్నీ తప్పుడు వాదనలు అంటూ తేల్చిచెప్పారు. ఆమె తనపై చేసిన ఆరోపణలు పరువుకు భంగం కలిగించడంతో పాటు ఎంతో మానసిక వేదనకు గురిచేశాయని చెప్పారు. దీంతో తన సోదరిపై పరువు నష్టం దావా వేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శామ్ ఆల్ట్‌మన్ సోదరి అన్‌ ఆల్ట్ కీలక ఆరోపణలు చేశారు. 

Also Read: లిప్‌స్టిక్‌తోపాటు కత్తీ, కారం పొడి తీసుకెళ్లండి.. మంత్రి కీలక వ్యాఖ్యలు

 1990 చివరి నుంచి 2000 వరకు మిస్సౌరీలో ఉన్నప్పుడు శామ్‌ ఆల్ట్‌మన్‌ తనను లైంగికంగా వేధించాడని ఈ ఏడాది జనవరిలో ఆరోపణలు చేశారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే లైంగిక వేధింపులు మొదలయ్యాయని.. దాదాపు పదేళ్ల పాటు ఇవి కొనసాగినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో శామ్‌ ఆల్ట్‌మన్‌ మేజర్ అయినప్పటికీ.. తాను మాత్రం మైనర్‌ అని చెప్పారు. దీంతో ఆమె కోర్టులో దావా వేశారు.

Also Read: ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం.. లెఫ్టినెంట్ జనరల్ భార్య ఆసుపత్రిపాలు!

అయితే తనన లైంగికంగా వేధింపులకు గురిచేశాడని అన్‌ ఆల్ట్‌మన్ చేసిన ఆరోపణలను శామ్‌ ఆల్ట్‌మన్ ఖండించారు. చివరికీ కోర్టును ఆశ్రయించారు. తనపై సోదరి చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠను దిగజార్చాయని చెప్పుకున్నాడు. అలాగే తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశాయంటూ పేర్కొన్నారు. తన నుంచి ఆర్థిక సాయాన్ని పొందాలనే కుట్రతోనే తనపై కోర్టులో దావా వేసిందని చెప్పారు. దీంతో ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే శామ్‌ ఆల్ట్‌మన్‌ తన సోదరిని లైంగికంగా వేధించాడనే వార్తలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఆయన దీనిపై స్పందించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  

Also Read: ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం.. లెఫ్టినెంట్ జనరల్ భార్య ఆసుపత్రిపాలు!

Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pakistan: పాకిస్థాన్‌లో 8.60 లక్షల మందికి పైగా బహిష్కరణ..

తమ దేశంలో అక్రమంగా ఉంటున్న అఫానిస్థానీయులను పాకిస్థాన్‌ వెనక్కి పంపిస్తోంది.2023 సెప్టెంబర్‌లో ఈ బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటిదాకా దాదాపు 8.60 లక్షలకు పైగా అఫ్గానిస్థాన్ శరణార్థులు పాకిస్థాన్‌ను వీడినట్లు సమాచారం.

New Update
Over 860,000 Afghans left Pakistan

Over 860,000 Afghans left Pakistan

పాకిస్థాన్‌ బహిష్కరణ వేటు మొదలుపెట్టింది. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న అఫ్గానిస్థానీయులను స్వదేశానికి పంపిస్తోంది. 2023 సెప్టెంబర్‌లో ఈ బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటిదాకా దాదాపు 8.60 లక్షలకు పైగా అఫ్గానిస్థాన్ శరణార్థులు పాకిస్థాన్‌ను వీడినట్లు సమాచారం.  వీళ్లలో దాదాపు 5 లక్షల మంది ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉన్న రెండు సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా అఫ్గాన్‌కు వెళ్లిపోయినట్లు పాకిస్థాన్‌ మీడియా తెలిపింది. 

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న అఫ్గానిస్థాన్ శరణార్థులను దశలవారీగా వాళ్ల దేశానికి పంపించాలని పాక్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 2023లో మొదటి దశను ప్రారంభించింది. సరైన డాక్యుమెంట్స్ లేకుండా అక్రమంగా ఉంటున్నవాళ్లని మాత్రమే తొలి దశలో పంపింది. 2023 సెప్టెంబర్ 15 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 5 వరకు 8,61,763 మంది స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. 

Also Read: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్

ఇక అఫానిస్థాన్ సిటిజన్ కార్డు (ACC) ఉన్నవాళ్లందరూ మార్చి 31 నాటికి తమ దేశం విడిచి వెళ్లాలని.. లేదంటే బహిష్కరణ వేటు తప్పదని ఈ ఏడాది జనవరిలోనే పాక్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాజాగా వాళ్లను బహిష్కరించే చర్యలను ఏప్రిల్ 1న ప్రారంభించింది. ఇప్పటిదాకా 16 వేల మందికి పైగా అఫ్గాన్ సిటిజన్‌ కార్డు ఉన్నవాళ్లు పాక్‌ను వీడారు. వీళ్లలో 9 వేల మంది స్వచ్ఛంగానే వెళ్లారు. ఆరు వేల మందిపై పాక్‌ బహిష్కరణ వేటు వేసింది. 

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

telugu-news | rtv-news | pakistan | afganisthan | national-news 

Advertisment
Advertisment
Advertisment