New Zealand PM : ఢిల్లీలో స్థానిక పిల్లలతో కలిసి క్రికెట్‌ ఆడిన న్యూజిలాండ్‌ ప్రధాని.. ఫొటోలు వైరల్‌

న్యూజిలాండ్‌ ప్రధాని  క్రిస్టఫర్‌ లక్సన్‌భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు సరదాగా బ్యాటు పట్టారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ తో కలిసి ఢిల్లీ లో స్థానిక పిల్లలతో క్రికెట్‌ ఆడారు. ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

New Update
New Zealand PM

New Zealand PM

New Zealand PM : న్యూజిలాండ్‌ ప్రధాని  క్రిస్టఫర్‌ లక్సన్‌భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు సరదాగా బ్యాటు పట్టారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ తో కలిసి ఢిల్లీ లో స్థానిక పిల్లలతో క్రికెట్‌ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను క్రిస్టఫర్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఇరు దేశాల‌ను ఏకం చేయ‌డంలో క్రికెట్‌ను మించిన‌ది లేదంటూ క్రిస్టోఫ‌ర్ ల‌క్స‌న్‌ ట్వీట్ చేశారు. తాను క్రికెట్ ఆడిన ఫొటోల‌ను పంచుకున్నారు.


 Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

కాగా, తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను న్యూజిలాండ్‌ ప్రధాని కలిశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ , క్రిస్టఫర్ లక్సన్ సోమవారం దిల్లీలో విస్తృత స్థాయి చర్చలు కూడా జరిపారు.

Also Read: Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు

New Zealand Prime Minister Plays Cricket

అంతకు ముందు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి  క్రిస్టోఫర్ లక్సన్ న్యూఢిల్లీలోని BAPS స్వామినారాయణ అక్షరధామ్‌ను సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.. క్రిస్టోఫర్ లక్సన్ తోపాటు ప్రభుత్వ అధికారులు, మంత్రులు, వ్యాపారవేత్తలు, న్యూజిలాండ్ నుండి వచ్చిన కమ్యూనిటీ ప్రతినిధులు సహా 110 మంది సభ్యుల ప్రతినిధి బృందం స్వామినారాయణ అక్షరధామ్‌ను సందర్శించారు.  ప్రధాని లక్సన్, ఆయన ప్రతినిధి బృందం BAPS మందిర్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ముగ్దులయ్యారు. ముందుగా వారికి BAPS స్వామినారాయణ అక్షరధామ్‌ పండితులు ప్రత్యేక స్వాగతం పలికారు..

Also Read: Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు

భారతదేశం గొప్ప వారసత్వం, భక్తి – విలువలను ప్రతిబింబించేలా రూపొందించిన  BAPS స్వామినారాయణ అక్షరధామ్‌ ఆలయ విశిష్టతలను వారంతా అడిగితెలుసుకున్నారు. గౌరవ సూచకంగా, ప్రధాన మంత్రి లక్సన్ స్వామినారాయణ అక్షరధామ్ మందిర్‌లో పూలను సమర్పించారు. ఈ పర్యటన సాంస్కృతిక జ్ఞాపికల మార్పిడి – రెండు (న్యూజిలాండ్ – భారతదేశం) సంస్కృతుల మధ్య లోతైన సహకారాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని.. లక్సన్ పేర్కొన్నారు.

Also Read: Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు- వైజాగ్ యువకుడు మృతి!

 

 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tahawwur Rana: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!

ముంబై 26/11 దాడి ప్రధాన నిందితుడు తహవూర్ రాణాపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. రాణా ఇండియాకు చేరుకోగానే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైలులో బిర్యానీ పెట్టి విశ్రాంతి తీసుకోమని మర్యాదలు చేయొద్దని కోరుతున్నారు. 

New Update
rana mumbai

Mumbai Victims Tahawwur Rana case

Tahawwur Rana: ముంబై 26/11 దాడి ప్రధాన నిందితుడు తహవూర్ రాణాపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. రాణా ఇండియాకు చేరుకోగానే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైలులో బిర్యానీ పెట్టి విశ్రాంతి తీసుకోమని మర్యాదలు చేయొద్దని కోరుతున్నారు. 

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

2-3 నెలల్లో ఉరితీయండి..

ఈ మేరకు రాణా నేడు భారతదేశానికి చేరుకోనుండగా అతన్ని తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బాధితులు, దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. 'రాణా లాంటి ఉగ్రవాదులకు భారతదేశం ఎలాంటి సౌకర్యాలు కల్పించకూడదు. కసబ్‌కు ఇచ్చినట్లుగా బిర్యానీ లేదా విశ్రాంతి ఇవ్వకూడదు. అటువంటి ఉగ్రవాదుల కోసం ప్రత్యేక చట్టం చేయాలి. తద్వారా వారిని 2-3 నెలల్లో ఉరితీయవచ్చు' అని ఆ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలను కాపాడిన మహ్మద్ తౌఫిక్ అలియాస్ 'ఛోటు చాయ్ వాలా' అన్నారు.

ఉగ్రవాదుల గురించి సమాచారం..

ఇక 'రాణాను చివరకు భారతదేశానికి తిరిగి తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉగ్రవాదంపై భారతదేశం సాధించిన అతిపెద్ద విజయం ఇది. అందువల్ల, నేను చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశం, అమెరికా ప్రభుత్వాలకు నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇచ్చింది. రాణాను తీసుకువచ్చిన వెంటనే అతని నుంచి పాకిస్తాన్‌లో ఇప్పటికీ దాక్కున్న ఉగ్రవాదుల గురించి సమాచారం సేకరించాలి. రాణాకు వీలైనంత త్వరగా మరణశిక్ష విధించాలి' అని దాడి బాధితురాలు దేవిక నట్వర్‌లాల్ రోతవాన్ అన్నారు.

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

ఈ దాడిలో మరణించిన SRPF కానిస్టేబుల్ తండ్రి నిందితుడు  రాణాకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 16 సంవత్సరాల క్రితం జరిగిన ఊచకోత తర్వాత తాను అనుభవించిన మానసిక కుంగుబాటు గురించి ఆయన మాట్లాడారు. '166 మంది ప్రాణాలను బలిగొన్న దాడుల్లో నిందితులందరికీ కఠిన శిక్ష విధించడం అనేది ఉగ్రవాద దాడిలో మరణించిన పోలీసు అధికారులు, పౌరులకు నిజమైన నివాళి అవుతుంది. ఈ ఘోరమైన దాడిలో చాలా మంది మరణించారు. 16 సంవత్సరాల తర్వాత కూడా దాని ప్రతికూల ప్రభావం ఇప్పటికీ నా మనస్సులో ఉంది' అని ఎస్ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రాహుల్ షిండే తండ్రి సుభాష్ షిండే ఎమోషనల్ అయ్యారు.

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

ఎలా జరిగిందంటే..
2008 నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైకి చేరుకుని నగరంలోని అనేక ప్రాంతాలపై దాడి చేశారు. రైల్వే స్టేషన్, రెండు పెద్ద హోటళ్ళు, ఒక యూదు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడులు దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. ఇందులో 166 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ 10 మంది ఉగ్రవాదుల్లో ఒకరు  కసబ్ మాత్రమే సజీవంగా పట్టుబడ్డారు. కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. నవంబర్ 2012లో పూణేలోని యెర్వాడ జైలులో ఉరితీయబడ్డాడు.

Also Read: టాప్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీబ్యూటీ..

 telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment