Trump-musk-Zelensky: జెలెన్‌ స్కీ...ట్రంప్‌..మధ్యలో మస్క్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం వెనక ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ జెలెన్‌ స్కీతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు సమాచారం.

New Update
Trump-Musk:  నా కేబినెట్‌ లో మస్క్‌: ట్రంప్‌!

America:

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం వెనక  ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ పాత్ర గణనీయమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రంప్‌ ప్రచారానికి భారీగా విరాళాలివ్వడమే కాక..బహిరంగ ర్యాలీల్లోనూ పాల్గొని ఓటర్లను ఉత్సాహపర్చారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ కార్యవర్గంలో మస్క్‌ కు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!

దాన్ని మరింత బలపర్చేలా మరో వార్త బయటికొచ్చింది. ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తో ట్రంప్‌ ఫోన్‌ లో మాట్లాడుతుండగా..ఆ కాల్‌ లో మస్క్‌ కూడా చేరినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఎలాన్‌ మస్క్‌ ఫ్లోరిడాలోని ట్రంప్‌ నివాసంలో ఆయనతో కలిసే ఉన్నారు. 

 ఆ సమయంలో ఎలాన్‌ మస్క్‌ ఫ్లోరిడాలోని ట్రంప్‌ నివాసంలో ఆయనతో కలిసే ఉన్నారు.ఆ సమయంలో ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌ ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.

Also Read: Brazil: విమానాశ్రయంలో కాల్పులు...ఒకరి మృతి!

వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా ట్రంప్‌ మధ్యలో ఫోన్‌ ను మస్క్‌ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్‌ స్కీతో మాట్లాడమని స్పేస్‌ఎక్స్‌ అధినేతను కోరినట్లు సమాచారం. దీంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి తో మస్క్ కొంతసేపు మాట్లాడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

వీరిద్దరూ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం గురించి చర్చించుకున్నారా? లేదా? అన్న దాని పై స్పష్టత లేదు. అయితే, ఉక్రెయిన్‌ లో స్టార్ లింక్‌ సేవలను కొనసాగిస్తానని మస్క్‌ చెప్పినట్లు సమాచారం. దాదాపు అరగంట పాటు ఈ ముగ్గురు చర్చించుకున్నారట. 

Also Read:  Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు హైదరాబాద్‌ వాసులు మృతి

ఉక్రెయిన్‌ కు అండగా ఉంటానని ట్రంప్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే తాజా కథనాల నేపథ్యంలో ట్రంప్‌ కార్యవర్గంలో మస్క్‌ ప్రభావవంతమైన పదవి చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

ఇటీవల ఫలితాల అనంతరం ట్రంప్‌ ప్రసంగిస్తూ యుద్ధాల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. నేను యుద్దాలను ప్రారంభించను. కానీ వాటిని ముగించేందుకు సాయం చేసత్ఆ అని అన్నా రు. అంతకుముంఉద కూడా రష్యా -ఉక్రెయిన్‌ సంఘర్షణల గురించి ఆయన పలుమార్లు స్పందించారు. తాను అధికారంలోకి వస్తే ఒక్క రోజులోనే ఉద్రిక్తతలను ముగిస్తానని చెప్పారు. 

Also Read:  Mallareddy: మల్లారెడ్డితో పాటు ఆ 12 మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి..? త్రివిధ దళాల మెరుపు దాడుల్లో వీళ్లే మునగాళ్లు

ప్లాన్ ప్రకారం టార్గెట్‌ను నాశనం చేయడమే సర్టికల్ స్ట్రైక్. భారత్ ఉగ్రవాదులపై 2016లో ఆర్మీతో, 2019లో ఎయిర్ ఫోర్స్‌తో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆర్మీలో పారా కమాండోలు, నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్‌లో గరుడ సర్జికల్ స్ట్రైక్స్‌కు పెట్టింది పేరు.

New Update
12556513

ఇండియాపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడినప్పుడు ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్‌లో బుద్ధి చెబుతుంది. పాక్ తీవ్రవాద చర్యలకు చేతులు కట్టుకొని కూర్చునే ప్రస్తక్తే లేదనే భారత్ గతంలో రెండుసార్లు నిరూపించింది. పహల్గామ్ దాడికి కూడా ప్రతీకారం ఉంటుందని మోదీ చెప్పకనే చెప్పారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తమన్నారు. టెర్రరిజాన్ని మట్టికలిపేస్తామని శపదం చేశారు. 2016 సెప్టెంబర్ 18న యూరీ టెర్రర్ అటాక్‌కు బదులుగా పదకొండు రోజుల్లోనే సెప్టెంబర్ 29న సర్టిజికల్ స్ట్రైక్ చేసింది భారత్ ఆర్మీ. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని దాదాపు 35 మంది టెర్రిస్తులను మట్టుబెట్టింది. తర్వాత 2019 పుల్వామా అటాక్‌కు పాక్ చెంపపై కొట్టినట్టే 12 రోజుల్లోనే ఎయిర్ స్ట్రైక్ చేసింది. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల శిభిరాలపై నిప్పుల వర్షం కురిపించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఫస్ట్ టైం ఆర్మీని, సెకండ్ టైం ఎయిర్ ఫోర్స్‌ను స్ట్రైక్ కోసం వాడారు. పహల్గామ్ టెర్రర్ అటాక్ కౌంటర్‌గా ఇప్పుడు మూడో సారి సర్జికల్ స్ట్రైక్ జరిగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిధ దళాల్లో నేవీతో ఈసారి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని భారత్ దెబ్బకొడుతుందా..? పహల్గామ్ పర్యటకుల దాడిలో ఓ నేవి ఆఫీసర్ చనిపోయాడు. ఈసారి నేవీతో స్ట్రైక్ చేయించి రక్షణ రంగంలో త్రివిధ దళాల పవర్ ఏంటో భారత్ చూపిస్తోందా??

సర్టికల్ స్ట్రైక్

సర్జికల్ స్ట్రైక్ అంటే ఒకరకమైన మిలిటరీ అటాక్. ఇందులో సైన్యం ముందుగా టార్గెట్ పెట్టుకున్న లక్ష్యాలను మాత్రమే ధ్వంసం చేస్తుంది. అది మనుషులు కావచ్చు, లేదా ఉగ్రవాద స్థావరాలు కావచ్చు. చుట్టుపక్కల పరిసరాలు, నివాస సముదాయాలు, వాహనాలు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి వాటికి సాధ్యమైనంత వరకు నష్టం వాటిల్లకుండా చూస్తుంది. ఈ తరహా దాడులను నిర్వహించడం కష్టంతో కూడుకున్నపని. దీనికి పక్కా ప్లానింగ్‌తోపాటు శత్రువుని కనురెప్ప పాటులో అంతం చేసే సైనికులు అవసరం. మెరుపు దాడులకు ట్రైనింగ్ అయిన కమాండోస్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీలో పారాషూట్ రెజిమెంట్‌కు చెందిన పారా కమాండోలు ఇలాంటి ఆపరేషన్లు చేపట్టడంలో సిద్ధహస్తులు. నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన గరుడాలకు సర్జికల్ స్ట్రైక్స్ చేయడంలో ప్రావీణ్యం ఉన్న టీంలు.

2016లో యూరి ఉగ్రదాడికి ప్రతీకారం..

పంజాబ్‌లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ క్యాంప్‌లో 2016 జనవరి 2న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ యునైటెడ్ జిహాద్ కౌన్సిల్‌కు చెందిన నలుగురు టెర్రరిస్టులు చొరబడ్డారు. వైమానిక స్థావరంలోని సైనికులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఏడుగురు సైనికులు చనిపోయారు. మల్లీ టెర్రరిస్టులు అదే రీతిలో.. జమ్మూకశ్మీర్‌లోని యూరీ ప్రాంతంలో 2016 సెప్టెంబర్‌ 18న నలుగురు టెర్రరిస్టులు భద్రతా బలగాలపై దాడి చేశారు. దీన్నే యూరీ అటాక్ అని కూడా అంటారు. దీనికి సమాధానంగా ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసింది. దానికోసం ఆర్మీలో మెరుపు దాడుల్లో ఎక్స్‌పర్ట్స్ అయిన పారా కమాండోలను రంగంలోకి దింపింది. 2016 సెప్టెంబర్ 29న ఇండియా సర్జికల్ స్టైక్ చేసింది. పాకిస్థాన్ నియంత్రణ రేఖను దాటి వెళ్లి, ఉగ్రవాదులపై దాడి చేసింది. దాదాపు 35 నుంచి 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

2019లో పుల్వామా అటాక్‌కు కౌంటర్

సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదుల ఆత్మహుతి దాడి జరిగింది. పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యగా మళ్లీ ఇప్పుడు భారత్ సర్జికల్ స్ట్రైక్‌ను నిర్వహించింది. ఫిబ్రవరి 26న (మంగళవారం) తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్, పీఓకేలోని ముజఫర్‌బాద్‌, చికోటీలోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడిచేసినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీ ఉగ్రవాద శిక్షణ శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు