USA:  స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..

అక్రమ వలసల చట్టాన్ని అమెరికాలో అధికారులు మహా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరేం చేసినా వెంటనే పట్టుకుంటున్నారు. తాజాగా పార్ట్ టైమ్ చేసుకుంటున్న ఇద్దరు విద్యార్ధులను అధికారులు పట్టుకున్నారు.

New Update
usa

USA

సాధారణంగా అమెరికాలో చదువు చాలా ఖరీదుగా ఉంటుంది. స్కాలర్ షిప్ లు వస్తే సరే...లేకపోతే పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ చదువుకోవాల్సిందే. ఇక్కడ కాలేజీలు, యూనివర్శిటీల్లో కట్టాల్సిన ఫీజులు చాలా ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. దాదాపు 80 శాతం మంది విద్యార్ధులు  ఇదే పని చేస్తారు. ఉదయం అంతా కాలేజీలకు అటెండ్ అవుతారు. సాయంత్రాలు, రాత్రుళ్లు పని చేసుకుంటారు. అయితే ఇక మీద ఇది కుదరేలా కనిపించడం లేదు. 

మిషిగన్ లో ఇద్దరు విద్యార్థులు..

అమెరికాలో మిషిగన్ స్టేట్ లో...ఓ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న ఇద్దరు విద్యార్థులను ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పని చేస్తుండగా పట్టుకున్నారు. వారు నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట పనులు చేస్తున్నారు. విద్యార్థులకు ఇలా పని చేయడం అధికారికంగా వీలు లేదు. అధికారులు ఈ ఇద్దరు విద్యార్థులపైనా మూడు రోజుల పాటూ నిఘా పట్ట మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తర్వాత వారికి ఇచ్చే గుర్తింపు సంఖ్య సెవిస్ ను రద్దు చేసారు. ఫిబ్రవరి 15లోగా అమెరికా విడిచి పెట్టి వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ స్టూడెంట్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

Also Read: USA: తహవూర్ రాణాను అప్పగించేందుకు ఒప్పుకున్న అమెరికా సుప్రీంకోర్టు

ప్రస్తుతం ఈ పరిస్థితి ఒక్క మిషిగన్ లోనే కాదు మొత్తం అమెరికా అంతా ఉంది.  అక్రమ వలసల చట్టాన్ని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నందు వలన ఎక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా అధికారులు పట్టుకుంటున్నారు. దీంతో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులందరిలో ఆందోళన మొదలైంది.  ఒక్క స్టూడెంట్సే కాదు భారత వ్యాపారస్థుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. జాబ్ లు ఇచ్చినందుకు వారిపైనా చర్యలు తీసుకోవడమే దీనికి కారణం.ఉన్నత చదువుల కోసం ఎఫ్‌-1 వీసాపై అక్కడ ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, మాస్టర్స్‌ పూర్తయి ఓపీటీ సమయంలో ఉన్నవారి పరిస్థితి ఎటూ తోచకుండా ఉంది.

Also Read: USA: అమెరికాలో మరోసారి రాజుకున్న కార్చిచ్చు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్

భారత్ పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు.నేను ఆ రెండు దేశాలకూ మంచి స్నేహితుడునే.కశ్మీర్‌ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది.ఆ రెండు దేశాలే దాన్ని ఎలాగోలా పరిష్కరించుకుంటాయని అన్నారు

New Update
Donald Trump

Donald Trump

భారత్ పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు.నేను ఆ రెండు దేశాలకూ మంచి స్నేహితుడునే.కశ్మీర్‌ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది.ఆ రెండు దేశాలే దాన్ని ఎలాగోలా పరిష్కరించుకుంటాయి.ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న మాట నిజమే.కానీ అవి ఎప్పుడూ ఉన్నాయిగా అని వ్యాఖ్యానించారు.కాగా..పాక్‌ ఏర్పడింది.1947 లో అని కూడా ట్రంప్‌ కు తెలీదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టి విమర్శిస్తున్నారు.

Also Read: BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని

ఇదిలా ఉంటే..జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ప్రధాని మోడీ కి ట్రంప్‌ ఫోన్‌ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహరాల శాఖ అధికార ప్రతినిధి  జైస్వాల్‌ సోషల్‌ మీడియాలో తెలియజేశారు. '' ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు.

Also Read: Realme 14T 5G: రియల్‌మి నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. సేల్ షురూ - ధర, ఆఫర్ల వివరాలివే!

ఉగ్రదాడిలో బలైన వారికి ట్రంప్‌  సంతాపం తెలియజేశారు. ఉగ్ర దాడి ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని జైస్వాల్‌ పేర్కొన్నారు.ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్‌ అన్నారు. ఉగ్రవాద పోరులో అమెరికా, భారత్‌ ఒకరికొకరు కలిసి పోరాడతాయని ఎక్స్‌ లో రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

ట్రంప్ ఫోన్ చేసి మద్ధతుగా మాట్లాడడంతో ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్‌ కృత నిశ్చయంతో ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. అంతకు ముందే ఇదే విషయమై ట్రంప్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్‌ ఉగ్ర ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు,.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మోడీకి, భారతప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

Also Read:AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

Also Read: Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి

trump | kashmir | Jammu and Kashmir | india | latest-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment