/rtv/media/media_files/2026/04/10/jd-vance-2026-04-10-20-28-52.jpg)
JD Vance Warns Iran Not To ‘Play’ US As He Departs For Truce Talks
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్లో జరిగిన కీలక చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంచలన ప్రకటన చేశారు.
పాకిస్థాన్ వేదికగా గత రెండు రోజులుగా సాగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. సుమారు 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరలేదని, తాము పెట్టిన కఠినమైన షరతులకు ఇరాన్ అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. "మేము కొన్ని స్పష్టమైన రెడ్ లైన్లు (పరిధులు), షరతులను ఇరాన్ ముందు ఉంచాం. కానీ వారు వాటిని ఒప్పుకోలేదు. అందుకే ఎటువంటి డీల్ లేకుండానే మేము అమెరికాకు తిరిగి వెళ్తున్నాం" అని వాన్స్ పేర్కొన్నారు.
JUST IN 🇮🇷🇺🇸: VP JD Vance Says No Agreement with Iran on Negotiations
— Ryan Rozbiani (@RyanRozbiani) April 12, 2026
The U.S. team will be returning to the U.S. after 21 hours. https://t.co/2T8nTFzuzcpic.twitter.com/ZxesRaxrHR
ఇరాన్కే ఎక్కువ నష్టం
ఈ చర్చలు విఫలం కావడం వల్ల అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టం జరుగుతుందని ఉపాధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆర్థికంగా, సైనికంగా దెబ్బతిన్న ఇరాన్, అమెరికా షరతులకు తలొగ్గకపోవడం ఆ దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం తన పంథాలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది.
చర్చలను ఏర్పాటు చేయడంలో కృషి చేసిన పాకిస్థాన్ ప్రభుత్వానికి జేడీ వాన్స్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా పాక్ ప్రధానమంత్రి, ఆ దేశ సైన్యాధిపతి (ఆర్మీ చీఫ్) చూపిన చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Follow Us