Cyber Crimes: సైబర్‌ నేరగాళ్ల వలలో భారతీయులు.. ఎట్టకేలకు 500 మంది స్వదేశానికి

మయన్మార్‌లో జరుగుతున్న సైబర్‌ స్కాం కార్యక్రమంలో వందలాది మంది భారతీయులు చిక్కుకుని అక్కడే పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాళ్లకు విముక్తి లభించింది. 500 మందికి పైగా భారతీయులను అక్కడి యంత్రాంగం కాపాడింది.

New Update
Cyber Crime

Cyber Crime


మయన్మార్‌లో జరుగుతున్న సైబర్‌ స్కాం కార్యక్రమంలో వందలాది మంది భారతీయులు చిక్కుకుని అక్కడే పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాళ్లకు విముక్తి లభించింది. 500 మందికి పైగా భారతీయులను అక్కడి యంత్రాంగం కాపాడింది. వేరే ఉద్యోగాల కోసం వెళ్లి సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కుకున్నవాళ్లు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. వీళ్లు మొదటగా థాయ్‌లాండ్‌కు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్నారు. 

Also Read: పన్నులు తగ్గించాలని అడగొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

వీళ్లలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందినవాళ్లు కూడా ఉన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ చొరవతో వీళ్లను ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. భద్రతా వ్యవస్థ లోపం కారణంగా మయన్మార్‌ సరిహద్దుల్లో సైబర్ కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ వ్యవహారంలో చైనా నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. దీంతో ఇటీవలే అక్కడ స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. చైనాతో పాటు వివిధ దేశాలకు చెందిన వేలాది మందిని సైబర్‌ నేరగాళ్ల నుంచి విడిపించారు.   

Also Read: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్

వీళ్లలో భారత్‌కు చెందినవారు 500 మందికి పైగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బస్సుల్లో థాయ్‌లాండ్‌ నుంచి మయన్మార్‌లోకి భారత అధికారులు ప్రవేశించారు. ఆ తర్వాత వాళ్లని తిరిగి తీసుకొచ్చారు. అయితే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం సీ-17 రవాణా విమానాన్ని పంపించింది. తొలి విడుతలో 266 మంది పురుషులు, 17 మంది మహిళలు భారత్‌కు వచ్చారు. ఇక మంగళవారం మరో 257 మంది స్వదేశానికి తిరిగిరానున్నారు. 

Also Read: కొండచిలువతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారులు.. వీడియో చూశారా?

Also Read: H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లకి బిగ్‌ షాక్.. రావడం కష్టమే

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment