Israel-Hamas ఇజ్రాయెల్ దాడి.. హమాస్‌ మిలిటరీ చీఫ్‌ మహమ్మద్‌ ఒడెహ్‌ హతం

గాజాలో హమాస్ ఉగ్రవాద సంస్థకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ మిలిటరీ చీఫ్‌లలో ఒకరైన మహమ్మద్ ఒడెహ్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. ఒడెహ్‌తో పాటు ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, మరో మహిళ ఉన్నారు.

New Update
FotoJet (10)

గాజాలో హమాస్ ఉగ్రవాద సంస్థకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ మిలిటరీ చీఫ్‌లలో ఒకరైన మహమ్మద్ ఒడెహ్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. గాజా సిటీలోని రద్దీగా ఉండే మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ భీకర దాడిలో మహమ్మద్ ఒడెహ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడిలో కేవలం మహమ్మద్ ఒడెహ్ మాత్రమే కాదు.. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒడెహ్‌తో పాటు ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, మరో మహిళ ఉన్నారు. మార్కెట్ ప్రాంతంలో జనం ఎక్కువగా ఉన్న సమయంలో ఈ దాడి జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. 

ఇది కూడా చూడండి: Fighter Jets : కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రైవేటు సంస్థలకు ఫైటర్ జెట్ల తయారీ ఛాన్స్

ఇది కూడా చూడండి: Namitha: ట్రోలర్స్‌కు నమిత స్ట్రాంగ్ వార్నింగ్! అసలేమైందంటే..?

హమాస్ నాయకులే టార్గెట్..

హమాస్ అగ్రనేతలను ఒక్కొక్కరిగా ఏరివేసే వ్యూహంలో భాగంగా ఇజ్రాయెల్ ఈ చర్య చేపట్టింది. ఈ నెల 16న హమాస్ మిలిటరీ చీఫ్‌గా ఉన్న ఇజ్ అల్ దిన్ అల్ హద్దద్‌ను కూడా ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. ఇప్పుడు మహమ్మద్ ఒడెహ్‌ను కూడా అంతం చేయడంతో.. హమాస్ సైనిక నాయకత్వం తీవ్ర సంక్షోభంలో పడింది.

ఇది కూడా చూడండి: Disha Mouni: దిశా-మౌనీ లెస్బియన్ రూమర్స్‌ పై మరో ట్విస్ట్… పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు?

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడులను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరినీ వెతికి మరీ అంతం చేస్తామని.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ నాయకులపై చేస్తున్న ఈ వరుస దాడులు నెతన్యాహు ప్రకటించిన ఆ ప్రతిజ్ఞలో భాగమేనని తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు