భారత్ సహా చాలా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో..వాషింగ్టన్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ట్రంప్ వీటిని అనౌన్స్ చేయనున్నారు. వీటి వల్ల అమెరికా ఆదాయం భారీగా పెరుగుతుందని ట్రంప్ అంటున్నారు. వైట్హౌస్ వర్గాల ప్రకారం ఏటా 600 బిలియన్ల నుంచి 700 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేస్తున్నారు.
భారత్, చైనాలతో పాటూ ప్రపంచంలో అన్ని దేశాల మీద ప్రతీకార సుంకాల విధింపు ప్రారంభం అవుతుంది. రేపటి రోజును అమెరికా లిబరేషన్ డే అని ట్రంప్ ఒక పేరు కూడా పెట్టారు. ఇప్పటి వరకు వరల్డ్ లో అన్ని దేశాలకు తాము తక్కువ సుంకాలు విధిస్తున్నా...అవి మాత్రం అమెరికా దగ్గర నుంచి రెట్టింపు వసూలు చేస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే ప్రతీకార సుంకాలను విధిస్తున్నామని..ఏ దేశం ఎంత టారీఫ్ విధిస్తే తామూ అంతే విధిస్తామని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి వీటిని స్ట్రిక్ట్ గా అమలు చేస్తామని ప్రకటించారు. ఏది ఏమైనా తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఇందులో నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని కూడా తేల్చి చెప్పేశారు. మిత్ర దేశాలైన భారత్ లాంటి వాటికి కూడా ఈ సుంకాల మోత తప్పదని ట్రంప్ కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాపై సుంకాలను ఎత్తివేసే దేశాల పట్ల సానుకూలంగా, మంచి వాడిగా ఉంటానని తెలిపారు. ఇన్నాళ్ళు తాము చాలా ఏళ్లుగా మేం ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించాం..కానీ ఇక మీదట అమెరికాను దోచుకోనివ్వమని మరోసారి చెప్పారు ట్రంప్.
అమెరికాకు శత్రుదేశాల కంటే మిత్రదేశాలే ఎక్కువ ద్రోహం చేశాయని ట్రంప్ అంటున్నారు. దశాబ్దాలుగా అవి మిమ్మల్ని దోచుకున్నాయని ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు అన్ని దేశాలు అమెరికాను దోచుకున్న దానికంటే ఇప్పుడు తాము విధిస్తున్న సుంకాలు ఎంతో తక్కువని ట్రంప్ సమర్ధించుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాలన్నిటిపైనా మా వాణిజ్య సుంకాలు అమలవుతాయని చెప్పారు.
సుంకాల కోత..
టారీఫ్ లవిషయంలో మిగతా దేశాల మాట ఎలా ఉన్నా...భారత్ మాత్రం అమెరికాకు ఎదురు తిరగదల్చుకోలేదని తెలుస్తోంది. సుంకాల విషయం అనౌన్స్ చేసిన దగ్గర నుంచే భారత్ వాటిని సమర్థిస్తూ వచ్చింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలన్న ఆలోచనతోనే ట్రంప్ ఇదంతా చేస్తున్నారని వెనకేసుకొచ్చారు. ఇండియా కూడా సరిగ్గా ఇలానే ఆలోచిస్తుందని అన్నారు. క్వాడ్లో ప్రతి దేశం తమవంతు పాత్ర పోషిస్తోంది. అందులో ఫ్రీ రైడర్లు ఎవరూ లేరు అంటూ జైశంకర్..ట్రంప్ ను వెనకేసుకుని వచ్చారు. దాని తరువాత భారత ప్రభుత్వం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చింది కూడా. దాని బట్టి అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించే దిశగా ఇండియా చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది.
భారత్ పై ప్రభావం..
విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై దాదాపు ప్రతి దేశమూ సుంకం విధిస్తుంది. తమ దేశంలో తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం...దాని ద్వారా ఉద్యోగాలను సృష్టించడానికే ప్రభుత్వాలు ఈ పని చేస్తాయి. దీని వలన దేశ ఖజానా కూడా నిండుతుంది. అయితే దీని వలన ఒక్కోసారి వినియోగదారులపై కూడా భారం పడే అవకాశం ఉంది. అధిక సుంకాల వలన ముడిసరుకు, కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆహార వస్తువులు, కూరగాయలు, బట్టలు, ఎలక్ట్రిక్ మెషినరీ, జెమ్స్, జ్యూయలరీ, ఫార్మా, ఐరన్, స్టీల్పై ఎక్కువ టారిఫ్లు పడే అవకాశం ఉంది. దాన్ని బట్టి వాటి ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా జరగకుండా ఉండడానికే భారత ప్రభుత్వం ఇప్పుడు యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న 30 రకాల ప్రొడక్ట్లపై టారిఫ్లు తగ్గించాలని చూస్తోంది. మనం తగ్గితే ఆటోమేటిక్ గా అమెరికా కూడా సుంకాలను తగ్గిస్తుంది.
today-latest-news-in-telugu | usa | trump tariffs | india | china
Also Read: NASA: మీడియా ముందుకు సునీతా విలియమ్స్..మళ్ళీ ఐఎస్ఎస్ కు వెళ్తా..