Khamenei : ఇరాన్ పాలకులను వణికిస్తున్న భయం... ఖమేనీ అంత్యక్రియల్లో జాప్యం ?

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించి ఏడు వారాలు గడుస్తున్నా, నేటికీ ఆయన అంత్యక్రియలు నిర్వహించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఖననం చేయకపోవడం వెనుక ఇరాన్ పాలకుల భయం, అంతర్గత అస్థిరత ప్రధాన కారణాలని రక్షణరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

New Update
FotoJet - 2026-04-20T112307.488

Khamenei's funeral

Khamenei : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించి ఏడు వారాలు గడుస్తున్నా, నేటికీ ఆయన అంత్యక్రియలు నిర్వహించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ మరణించి దాదాపు 50 రోజులు (ఏడు వారాలు) కావస్తున్నా, ఆయన భౌతికకాయాన్ని ఇంకా ఖననం చేయకపోవడం వెనుక ఇరాన్ పాలకుల భయం, అంతర్గత అస్థిరత ప్రధాన కారణాలని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1989లో ఖమేనీ పూర్వీకుడు ఇరాన్‌ పితామహుడు అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించినప్పుడు లక్షలాది మందితో భారీ అంత్యక్రియలు నిర్వహించిన ఇరాన్, ఇప్పుడు ఖమేనీ విషయంలో మాత్రం తడబడుతోంది. 

ఫిబ్రవరి 28, 2026న టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో 86 ఏళ్ల అలీ ఖమేనీ మరణించినట్లు సమాచారం. ఆయన మరణం తర్వాత ఇరాన్ పగ్గాలను ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ చేపట్టారు. అయితే, ముజ్తబా నేతృత్వంలోని యంత్రాంగం ప్రస్తుతం ఉనికిని కాపాడుకునే పోరాటంలో ఉంది. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ (FDD) నిపుణుడు బెహనామ్ తలేబ్లు అభిప్రాయం ప్రకారం.. ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుతం 'స్తంభించిపోయిన స్థితి'లో ఉంది. అంత్యక్రియల కోసం లక్షలాది మంది ఒకచోట చేరినప్పుడు, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తుందేమోనన్న భయం ఇరాన్‌ను వెంటాడుతోంది. "1989లో ఆ ప్రభుత్వ స్థాపక పితామహుడి అంత్యక్రియలకు అంత భారీ సంఖ్యలో ప్రజలు హాజరవ్వడం, అయినప్పటికీ ఒక తరం గడిచి, ఆయన మరణించి నెల రోజులు దాటినా ఆయన వారసుడు ఇప్పటికీ అంత్యక్రియలు జరుపుకోలేకపోవడం వెనుక అనేక కారణాలున్నాయి," అని తలేబ్లు అన్నారు.గత కొన్ని వారాలుగా ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థను దెబ్బతీసింది. ఖమేనీ మరణానంతరం దేశంలో జాతీయవాద నిరసనలు మిన్నంటాయి. భారీ బహిరంగ సభ నిర్వహిస్తే అది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారుతుందేమోనని పాలకులు భయపడుతున్నారు.

కొత్త సుప్రీం లీడర్‌గా భావిస్తున్న ముజ్తబా ఖమేనీ గత కొద్ది రోజులుగా ఎక్కడా బహిరంగంగా కనిపించడం లేదు. తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తే ఆయన ప్రజల ముందుకు రావాల్సి ఉంటుంది, ఇది ఆయన భద్రతకు ముప్పుగా భావిస్తున్నారు.  దేశంలో గత 50 రోజులుగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. నిజానిజాలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో, ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న మషద్ (Mashhad) నగరంలో ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది ఖమేనీ సొంత నగరం కావడం, ఇజ్రాయెల్ క్షిపణులకు దూరంగా ఉండటం ఒక కారణం.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. ఇరాన్ తన అణు ఆశయాలను విడనాడాలని, లేనిపక్షంలో ఇరాన్ లోని ప్రతి పవర్ ప్లాంట్ వంతెనలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఇరాన్ నియంతృత్వ వ్యవస్థ, తన సొంత నాయకుడికి కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో పడిపోవడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు