Podcost: ప్రధాని మోదీతో ఫ్రిడ్ మన్ ఎపిక్ పాడ్ కాస్ట్

అమెరికన్ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్ మన్ సోషల్ మీడియా పోస్ట్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.  నేను చేసిన అత్యంత పవర్ ఫుల్ ఎపిక్ పాడ్ కాస్ట్ మీ ముందుకు రాబోతోంది అంటూ ఫ్రిడ్ మన్ ఇందులో రాశారు. ఈ పాడ్ కాస్ట్ లో ఆయన ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు. 

New Update
usa

Fridman Poscost With PM Modi

భారత ప్రధాని మోదీతో మూడు గంటల పాటు అద్బుతమైన ఇంటర్వ్యూ చేశాను. ఇది నా జీవితంలో అత్యంత పవర్ ఫుల్ ఇంటర్వ్యూ ఇది అంటూ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్ మన్ చెబుతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా పోస్ట్ కూడా పెట్టారు. మార్చి 16 సాయంత్రం అంటే ఈరోజే ఇది విడుదల అవనుంది. 

అందరూ వినండి..

ఫ్రిడ్ మన్ సోషల్ మీడియా పోస్ట్ పై ప్రధాని మోదీ కూడా స్పందించారు. తన చిన్నతనం, హిమాలయాల్లో గడిపి సమయం లాంటి వాటి గురించి ఈ పాడ్ కాస్ట్ లో మాట్లాడాను అని మోదీ చెప్పారు. ఈ పాడ్ కాస్ట్ ను అందరూ వినాలని ఆయన కోరారు. ఇందులో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాల గురించి...ఏఐపై భారత్ పురోగతి గురించి కూడా మాట్లాడానని ప్రధాని తెలిపారు. ప్రధాని మోదీకి ఇది రెండో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ. అంతకు ముందు జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్ తో కూడా ఒక పాడ్ కాస్ట్ ను నిర్వహించారు. 

లెక్స్ ఫ్రిడ్ మన్...

ఫ్రిడ్ మన్ అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇంజనీర్, పాడ్ కాస్టర్. ఈయన ది లెక్స్ పఫ్రిడ్ మన్ పాడ్ కాస్ట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఫేస్‌బుక్ కో ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్,ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వంటి ప్రముఖ వ్యక్తుల ఇంటర్వ్యూను చేశారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీతో చేసిన గురించి మాత్రం ఫ్రిడ్ మన్ చాలా గొప్పగా చెప్పుకున్నారు. తాను ఇప్పటివరకు అధ్యయనం చేసిన అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి ప్రధాని అని ఆయన చెప్పాడు. 

 

Also Read: USA: అమెరికాను ముంచెత్తుతున్న పెను తుఫాన్లు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment