/rtv/media/media_files/2025/02/18/3p3oHWTO8Ox86FOwvz1J.jpg)
earthquake with sound
ఈ మధ్య భూకంపాలు విపరీతంగా సంభవిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ భూమి కంపించడంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా మరోసారి భూమి షేక్ అయింది. ఇండోనేషియాలోని మసోహికి ఉత్తర-వాయువ్య దిశలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం.. మసోహికి ఉత్తర-వాయువ్య దిశలో 5.32 UTC వద్ద 132 కి.మీ దూరంలో భారీ భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం క్రింద 32 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని ఏజెన్సీ పేర్కొంది. భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.