Earth quake: రోజూ ఎక్కడోచోట భూకంపం..తాజాగా పపువా న్యూ గినియాలో..

ప్రపంచం మొత్తం ఏదో అవుతోంది. ముఖ్యంగా ఆసియాలో.. గత వారం రోజులుగా ఏదో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టార్ స్కేల్ మీద 6.9గా నమోదు అయింది. 

New Update
Earth Quake: హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం

ఈ రోజు తెల్లవారు ఝామున పపువా న్యూగియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టార్ స్కేల్ పై 6.9 గా నమోదయింది. వెస్ట్ న్యూ బ్రిటన్ ప్రావిన్స్ లోని కింబే పట్టణానికి 194 కి.మీ దూరంలో వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.  దీంతో అమెరికా సునామీ హెచ్చరికలు జారీ చేసింది.  పపువా న్యూ గినియాలో ఆస్తి, ప్రాణ నష్టం ఏమైనా ఉందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

వరుస భూకంపాలు..

నిన్న రాత్రి నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.0 తీవ్రతతో నమోదైంది. గర్ఖాకోట్‌కు 3 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ఇది నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ భూకంప ప్రభావం ఉత్తర భారత్‌ను కూడా తాకింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా అనేదానిపై క్లారిటీ లేదు.

ఇటీవల మయన్మార్‌లో సంభవించిన భూకంపం విధ్వంసం సృష్టించింది. దీని ప్రభావానికి మయన్మార్‌తో పాటు, థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ భూ ప్రళయానికి ఇప్పటిదాకా 4 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 5 వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. 341 మంది  ఆచూకీ ఇంకా తెలియలేదు.

 today-latest-news-in-telugu | earth-quake

 

Also Read: USA: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు