BIG BREAKING: భారీ భూకంపం.. స్పాట్‌లో 11 మంది?

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలం జిల్లాలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

New Update
BREAKING

BREAKING

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలం జిల్లాలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఇది కూడా చూడండి: Prabhas Spirit: ప్ర‌భాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెష‌ల్’ అప్డేట్!

ఇది కూడా చూడండి: Tamil Nadu : తమిళనాడులో STF చీఫ్ గా 'లేడీ సింగం'భవానీశ్వరి? ఇంతకు ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా?

అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి..

భూకంప ప్రభావం ముఖ్యంగా జలాల్‌పూర్ షరీఫ్ ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎక్కువగా కనిపించింది. ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు బలహీనంగా ఉండటంతో.. భూకంప ధాటికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. గోడలు కూలిపోవడం, పైకప్పులు విరిగిపడటంతో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. గ్రామాల్లోని కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతినడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది.

సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: RTC Driver : ‘ముందు వడ్లు కొనండి సార్’.. అన్న RTC డ్రైవర్‌కు ఊహించని షాక్...అదేం లేదన్న మంత్రి పొన్నం...

ఇది కూడా చూడండి: BIG BREAKING : నాగేశ్వర్ కోసం ఏపీ పోలీసులు.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన!

Advertisment
తాజా కథనాలు