సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదు.. బల్ల గుద్ది చెప్పిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించినప్పటి నుంచి ప్రపంచ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ టారిఫ్‌లపై ట్రంప్ స్పందిస్తూ.. కొన్ని సమస్యలకు ఔషధం అవసరంమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సుంకాలను తగ్గించే ప్రసక్తి లేదని బల్ల గుద్ది చెప్పారు.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించినప్పటి నుంచి ప్రపంచ మార్కెట్ అతలాకుతలం అయిపోతుంది. కేవలం అమెరికా మార్కెట్లు మాత్రమే కాకుండా ఇండియా, చైనా, జపాన్ మార్కెట్లు కూడా భారీగా నష్టాల బాట పట్టాయి. అయితే ఈ విషయంపై ఇదే అంశంపై ఆదివారం విలేకర్లు ట్రంప్‌ను ప్రశ్నించారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ చాలా లైట్ తీసుకున్నారు.

ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

ఔషధం కొన్ని సమస్యలకు అవసరమని..

కొన్ని సమస్యలకు ఔషధం అవసరం అని తెలిపారు. దీంతో పాటు వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్ సమర్థించారు. అసలు సుంకాలను తగ్గించే ప్రసక్తి లేదని బల్ల గుద్ది చెప్పారు. ప్రపంచ మార్కెట్లు పతనమవ్వాలని సుంకాలు విధించలేదని, ఇవి పతనం కావాలని కోరుకోలేదన్నారు.

ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

ఈ టారిఫ్‌లపై అసలు టెన్షన్ తీసుకోవద్దని, కొన్నిసార్లు సమస్యను పరిష్కరించుకోవడానికి మెడిసిన్‌ కూడా తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ఐరోపా, ఆసియా దేశాధినేతలతో చర్చించారని, ఇప్పుడు వాళ్లంతా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆరాటపడుతున్నారని తెలిపారు. ఈ సుంకాల వల్ల అమెరికాలోకి బిలియన్ డాలర్ల ప్రవాహం మొదలైందని వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించినప్పటి నుంచి కేవలం దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రమే కాకుండా .. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల బాట పడుతున్నాయి. ట్రంప్ టారిఫ్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపనుందని మార్కెట్ నిపుణులు కూడా అంటున్నారు. జపాన్ నిక్కీ 8 శాతం వరకు పతనమైంది. ఇదే కాకుండా గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. ట్రంప్ సుంకాల వల్ల మూడు రోజుల్లో రూ.3 వేలకు పైగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 

ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment