H-1B visa: హెచ్‌-1బీ వీసాలో మార్పులు.. పాత రికార్డులన్నీ తొలగింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌-1బీ వీసా జారీ విషయంలో కొత్త వ్యవస్థ అమలుపై దృష్టి పెట్టారు. నేటి నుంచి ఐదేళ్ల కంటే పాతవైన రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. పాత వీసాల రికార్డులను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలకు ఆదేశించారు.

New Update
H 1 B VISA

H 1 B VISA Photograph: (H 1 B VISA)

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వీసా జారీ ప్రక్రియలో కొత్త వ్యవస్థను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీసా దరఖాస్తులను పరిశీలించే  ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్‌వే వ్యవస్థలో ఉన్న పాత రికార్డులు, దరఖాస్తులను తొలగించనుంది.

ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ

పాత వీసాల రికార్డులు అన్నింటిని..

ఐదేళ్ల కంటే పాతవైన రికార్డులను సిస్టమ్ నుంచి నేటి నుంచి తొలగించనున్నారు. అంటే ఉదాహరణకు నేటి తేదీ నుంచి గతంలో ఐదేళ్ల వరకు ఉన్న పాత రికార్డులను తొలగిస్తారు. ఈ పాత వీసాల రికార్డులు అన్నింటిని కూడా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలని ఇప్పటికే కొన్ని సంస్థలకు ఆదేశించారు. డౌన్‌లోడ్ చేసి పెట్టుకోకపోతే మాత్రం తప్పకుండా ఆ రికార్డులను కోల్పోవలసి వస్తుందని తెలిపింది. హెచ్‌-1బీ సహా అన్ని తాత్కాలిక లేబర్‌ కండిషన్‌ అప్లికేషన్స్‌, శాశ్వత లేబర్‌ సర్టిఫికేట్‌ అఫ్లికేషన్లపై కూడా ఈ తొలగింపు ఉంటుందని ఆఫీస్‌ ఆఫ్‌ ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ విభాగం నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు

వీసాల జారీ కోసం యూఎస్‌ ఇమిగ్రేషన్‌ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించనుంది. దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ సర్కారు వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

China: స్నేహం కావాలి..అమెరికా దెబ్బకు చైనాకు భారత్ గుర్తొచ్చింది..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో చైనాకు ఊపిరి ఆడడం లేదు. చైనా కూడా ఈ యుద్ధంలో తగ్గడం లేదు కానీ.. మిగతా దేశాల సపోర్ట్ కావాలని మాత్రం అనుకుంటోంది. భారత్‌ సహా పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. 

New Update
11

చైనాకు భారత్ పొరుగు దేశం. ఒకే సరిహద్దును పంచుకుంటున్న ఆసియా దేశాలు. కానీ ఆ దేశం ఎప్పుడు ఇండియా మీద కాలుదువ్వుతూనే ఉంటుంది. మన దేశంలో ప్రదేశాలను ఆక్రమించుకోడానిక, దాడి చేయడానికి అదను చూస్తూనే ఉటుది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. కానీ ఇప్పుడు మాత్రం భారత్ తో సమా పొరుగు దేశాతో వ్యాహాత్మక సంబంధలను పెంపొందించుకొంటామని అంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. దీనికి కారణం అమెరికా కొట్టిన సుంకాల దెబ్బ. మిగతా ఏ దేశాలకు లేని విధంగా అత్యధిక టారీఫ్ లను చైనాపై విధించారు ట్రంప్. ఏకంగా 125 శాతం టారీఫ్ లతో విరుచుకుపడ్డారు. చైనా కూడా అమెరికా ధీటుగా జవాబిస్తోంది కానీ ఎక్కువ కాలం నిలబడలేకపోవచ్చును. ఇప్పుడు ఆ దేశానికి మిగతా దేశాల సపోర్ట్ చాలా అవసరం. అందులో భాగ్గానే జిన్ పింగ్ స్నేహం కావాలి అంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. 

ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పని చేస్తాం..

తమ మధ్య అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలను మరింత పెంపొందించుకునేదుకు ప్రయత్నిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెబుతున్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్ తో కలిసి పని చేస్తామని.. ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామని అంటున్నారు. బీజింగ్‌లో మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా దీనికి వత్తాసు పలికారు. అధ్యక్షుడు చెప్పినట్టుగా పొరుగు దేశాలతో వ్యవహారం అమలులో పెట్టాలని అన్నారు.  ఇందులో భాగంగా జిన్‌పింగ్‌ త్వరలో కీలక పొరుగు దేశాలైన వియత్నాం, మలేసియా, కాంబోడియాలలో సందర్శించే అవకాశముంది.

today-latest-news-in-telugu | china | india | usa | trump tariffs 

Also Read: Mary Kom: విడాకులు తీసుకోబోతున్న మేరీకోమ్?

 

Advertisment
Advertisment
Advertisment