Trump: ట్రంప్‌ను మైక్‌తో కొట్టిన రిపోర్టర్.. వీడియో వైరల్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్రంప్‌ను ప్రశ్నలు అడుగుతుండగా ఓ రిపోర్టర్‌ చేతిలో ఉన్న మైక్‌ ఆయన ముఖానికి తగిలింది. దీంతో ట్రంప్‌ ఆ రిపోర్టర్ వైపు సీరియస్‌గా చూశారు.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్రంప్‌ను ప్రశ్నలు అడుగుతుండగా ఓ రిపోర్టర్‌ చేతిలో ఉన్న మైక్‌ ఆయన ముఖానికి తగిలింది. దీంతో ట్రంప్‌ ఆ రిపోర్టర్ వైపు సీరియస్‌గా చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్‌ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే

ఇక వివరాల్లోకి వెళ్తే.. జాయిండ్ బేస్‌ ఆండ్రూస్ ఎయిర్‌పోర్టులో గాజా పరిస్థితులపై జర్నలిస్టులు ట్రంప్‌ను ప్రశ్నలు అడగగా ఆయన బదులిస్తున్నారు. ఓ రిపోర్టర్ ప్రశ్న అడుగుతుండగా.. మరో రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్ ట్రంప్‌ ముఖానికి ప్రమాదవశాత్తు తగిలింది. దీంతో ఆయన సీరియస్ అయ్యారు. కనుబొమ్మలతో ఆ రిపోర్టర్‌ను హెచ్చరించినట్లుగా చూశారు. ఆ తర్వాత రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలిచ్చారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజెన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment