USA-China: ట్రంప్‌కు షాకిచ్చిన చైనా.. ఏకంగా 125% టారిఫ్ విధింపు..

చైనాపై విధిస్తున్న సుంకాలను అమెరికా 145 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా.. అమెరికాపై ఉన్న 84 శాతం టారిఫ్‌ను 125కి పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. దీనివల్ల ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుదని నిపుణులు చెబుతున్నారు.

New Update
Trump and Jinping

Trump and Jinping

అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్‌ రోజురోజుకి ముదురుతోంది. ట్రంప్‌ టారిఫ్‌లపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో ట్రంప్ సర్కార్ చైనా మినహా ప్రపంచంలో అన్ని దేశాలపై తన టారిఫ్‌లను 90 రోజుల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా--చైనా టారిఫ్‌లను పెంచుకుంటూనే పోతున్నాయి. 

ప్రస్తుతం ట్రంప్‌.. చైనాపై విధిస్తున్న సుంకాలను 145 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా అమెరికాపై ఉన్న 84 శాతం టారిఫ్‌ను 125కి పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. అమెరికా తమపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ యూరోపియన్ యూనియన్ సహకారం కోరుతున్నారు. 

Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!

అధిక సుంకాల వల్ల చైనాలోకి అమెరికా ఉత్పత్తులు ఎగుమతి చేయడం కష్టంగా మారిందని చైనా ఆర్థికమంత్రి తెలిపారు. ఇరు దేశాలు ఇలా సుంకాలు పెంచడంతో వీటి ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిణామాలకు అమెరికాదే బాధ్యత అని చైనా అంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా భయాన్ని సృష్టిస్తోందని ఆరోపిస్తోంది. 

చైనా ఒత్తిడి వల్లే అమెరికా ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలపై తాత్కాలికంగా సుంకాల అమలును 3 నెలల పాటు నిలిపివేసినట్లు చెప్పింది. సుంకాలతో ఇలా ట్రేడ్‌వార్ చేస్తే ఎవరికీ ఉపయోగం ఉండదని జిన్‌పింగ్ చెబుతున్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా, చైనాతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్‌హువా తెలిపింది. 

Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!

అధిక టారిఫ్‌ల వల్ల చైనాలో లక్షలాది పరిశ్రమయ యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు తక్కువ రేట్లకే ఆఫర్లు ఇస్తున్నారు. ట్రంప్‌ను రెచ్చగొట్టడం కంటే ఒప్పందం కుదుర్చుకోవడం ముఖ్యమని చైనాకు నిపుణులు సూచిస్తున్నారు. మరీ ఈ ట్రేడ్‌వార్ అనేది ఎప్పుడు ముగుస్తుందో అనేదానిపై క్లారిచీ లేదు. 

trump | jinping | trump tariffs | rtv-news

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Woman Attack: షాకింగ్ వీడియో.. మహిళను పైకి లేపి నేలకేసి ఎలా కొట్టారో చూశారా?

సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో ఒక మహిళను మరో నలుగురు మహిళలు అతి దారుణంగా కొట్టడం చూడవచ్చు. జుట్టు పట్టుకుని, పిడుగుద్దులతో చితకబాదారు. ఆమెను పైకి లేపి నేలకేసి కొట్టారు. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.

New Update
viral news

viral news

Woman Attack: మహిళలు ఒక్కసారి గొడవ పడ్డారంటే.. అది పూర్తయ్యేవరకు విడిచి పెట్టరు. నడి రోడ్డుపై సైతం తన్నుకునేందుకు ముందుంటారు. జనాలు ఉన్నారని చూడరు. ఎవరుంటే తమకేమి అన్నట్లు ప్రవర్తిస్తారు. జుట్లు పట్టుకుని బాదుకుంటారు. బట్టలు చిరిగేలా కొట్టుకుంటారు. ఆ సమయంలో వారిని ఆపడం చాలా కష్టం. ఇప్పటి వరకు చాలానే అలాంటి సంఘటనలు చూశాం. తాజాగా మరొకటి జరిగింది. 

మహిళపై దాడి

ఒక మహిళ నడుచుకుంటూ తిన్నగా తన ఇంటికి వెళ్తుండగా.. వేరొక మహిళ ఆమె ముందుండి నడుచుకుంటూ వెళ్తుంది. అలా కొంత దూరం నడిచి వెళ్తుండగా.. సడెన్‌గా ఇంకొందరు మహిళలు వచ్చి ఆమెపై దాడి చేశారు. దాదాపు నాలుగురు లేదా ఐదురుగు మహిళలు కలిసి ఒక మహిళను అతి దారుణంగా చితకబాదారు. 

Also Read: ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆ మహిళను జుట్టు పట్టుకుని.. పిడి గుద్దులతో ఎంత గుద్దినా.. తిరిగి చేయి ఎత్తలేదు. దెబ్బలు కాస్తున్నా తిన్నగా ఇంటివైపు నడుచుకుంటూ వెళ్లిపోయింది. సరిగ్గా అప్పుడే ఒక అబ్బాయి వచ్చి ఆ మహిళను అమాంతంగా పైకి లేపి కిందికి విసిరేశాడు. అప్పుడు కూడా ఆ మహిళ ఏం అనకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

viral-video | viral-news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment