Canada: కెనడాలో ఊహించని పరిణామం.. పార్లమెంట్‌కు తాళాలు

కెనడా పార్లమెంటు భవనాన్ని ఒట్టావా పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. శనివారం ఆ భవనంలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడని అందుకే మూసివేసినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం ఉదయం అతడిని అందుబాటులోకి తీసుకుని దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Canada parliament briefly put on lockdown

Canada parliament briefly put on lockdown

కెనడాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అక్కడి పార్లమెంటు భవనాన్ని ఒట్టావా పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. శనివారం ఆ భవనంలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడని అందుకే మూసివేసినట్లు పోలీసులు చెప్పారు. పార్లమెంట్‌ హిల్‌లోని తూర్పు బ్లాక్‌లోకి అక్రమంగా వచ్చిన దుండగులు రాత్రంతా లోపలే ఉన్నాడని తెలిపారు. అతడి దగ్గర ఆయుధాలు ఉన్నాయా ? లేదా ? అనేదానిపై స్పష్టత లేదు.  ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి పార్లమెంటు భవనంలోకి చొరబడచంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

పార్లమెంటు భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. తూర్పు బ్లాక్‌లో ఉన్న సిబ్బంది అందరూ ఒకే గదిలోకి వచ్చి తాళాలు వేసుకోవాలని సూచించారు. భవనంలో ఉన్న పలు ప్రదేశాలపై కూడా లాక్‌డౌన్ పెట్టారు. అలాగే పార్లమెంటుకు దగ్గర్లో ఉన్న రోడ్లని మూసివేస్తున్నామని.. ప్రజలు ఎవరూ కూడా అటువైపు రావొద్దని అధికారులు ఆదేశించారు. చివరికీ ఆదివారం ఉదయం దుండగుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు చెప్పారు. 

ఏప్రిల్ 28న కెనడాలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ గత నెల 23వ తేదీన పార్లమెంటును రద్దు చేశారు. వాస్తవానికి అక్కడ అక్టోబర్ 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ దాదాపు ఆరు నెలలకు మందుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్లమెంటులోకి దుండగుడు ప్రవేశించడం కలకలం రేపుతోంది. అందులో ఉండే సున్నితమైన సమాచారాన్ని ఎత్తుకెళ్లడం కోసం దుండగులు వచ్చాడా ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. 

Also Read: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

telugu-news | canada | rtv-news 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pak: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్‌ సైన్యాధిపతి!

పాక్‌ నేతలు భారత్‌ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్‌ సైన్యాధిపతి ఆసిం మునీర్‌ మరోసారి భారత్‌ పై అక్కసు వెళ్లగక్కారు.రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.

New Update
 Pakistan army chief Asim Munir

Pakistan army chief Asim Munir

పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్‌ పాత్ర ఉందని పేర్కొన్న భారత్‌..దాయాది దేశం పై చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పాక్‌ నేతలు భారత్‌ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్‌ సైన్యాధిపతి ఆసిం మునీర్‌ మరోసారి భారత్‌ పై అక్కసు వెళ్లగక్కారు.

Also Read: Russia-Ukrain-Putin: ఉక్రెయిన్‌ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!

రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.మతంఆచారాలు,సంప్రదాయాలు, ఆలోచనలు,ఆకాంక్షల్లో హిందూ ,ముస్లింలు వేర్వేరు.వీటి ఆధారంగానే రెండు దేశాలు ఉండాలనే భావన ఏర్పడింది.పాకిస్తాన్‌ ఏర్పాటుకు పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు.

Also Read: BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

వాటిని ఎలా కాపాడుకోవాలో మనకు తెలుసు అని పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ పేర్కొన్నారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పాక్‌ మిలిటరీ అకాడమీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతకు ముందు ప్రవాస పాకిస్థానీల తొలి సదస్సులోనూ మునీర్‌ ఇదే విధంగా మాట్లాడారు.

మనది ఒక దేశం కాదని,రెండు దేశాలన్నారు.కశ్మీర్‌ తమ జీవనాడి లాంటిదని వ్యాఖ్యానిచారు.ఇలా మాట్లాడిన కొన్ని రోజుల్లోనే పహల్గాంలో ముష్కరులు పాశవిక దాడులకు పాల్పడ్డారు.


జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హిందువుల ఊచకోత తర్వాత, భారత్ .. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సింధూ జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయడం, పాకిస్తాన్ హైకమిషన్‌లో దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించడం, అట్టారి-వాఘా సరిహద్దును మూసివేయడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇవి పాకిస్తాన్‌లో భయాందోళనలను సృష్టించింది. ఏ క్షణమైనా భారత్ తో యుద్దం సంభవించవచ్చనని భావించిన పాక్.. భయపడిపోయి చైనాను ఆశ్రయించి సహాయం కోసం విజ్ఞప్తి చేసింది.

పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ ఇస్లామాబాద్‌లో చైనా రాయబారి జియాంగ్ జెతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు.  ఒకవేళ భారత్ తో యుద్దం సంభవిస్తే సహాయం చేయాలని కోరారు.  అందుకు చైనా కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ వెల్లడించారు.  భారత్ తమపై ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఉగ్రవాద దాడిపై నిష్పాక్షిక దర్యాప్తుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 

పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్‌ మమ్మల్ని నిందిస్తోంది.ఈ దాడి పై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరిగినట్లు కనిపించడం లేదు. ఒక వేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్‌ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 22న జరిగిన ఈ ఊచకోతలో, 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడిని ఉగ్రవాదులు చంపేశారు.

Also Read:Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Also Read: BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

pak | army | chief | Asim Munir | bharat | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment