Ukraine: ఉక్రెయిన్ దాడిలో రష్యా లెఫ్టినెంట్‌ జనరల్ మృతి..

ఉక్రెయిన్ దాడిలో రష్యా లెఫ్టినెంట్‌ జనరల్, న్యూక్లియర్, జీవ రసాయన రక్షణ దళం చీఫ్‌ ఇగోర్‌ కిరిలోవ్‌ మృతి చెందారు. తాను ఉంటున్న అపార్ట్‌మెంటు బయట ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో అమర్చిన బాంబు పేలడంతో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
Igor
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఉక్రెయిన్ చేసిన దాడిలో రష్యా లెఫ్టినెంట్‌ జనరల్,  న్యూక్లియర్, జీవ రసాయన రక్షణ దళం చీఫ్‌ ఇగోర్‌ కిరిలోవ్‌ మృతి చెందారు. తాను ఉంటున్న అపార్ట్‌మెంటు బయట ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో అమర్చిన బాంబు పేలడంతో మంగళవారం ఉదయం ఘటన చోటుచేసుకుంది. ఇగోర్‌ కిరిలోవ్‌తో పాటు తన అసిస్టెంట్‌ కూడా ఈ బాంబు దాడిలో మరణించాడు. ఈ హత్యకు తామే బాధ్యులమని సెక్యూరిటీ సర్వీసెస్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌ వెల్లడించింది. 
అయితే ఉక్రెయిన్‌ సైనికులపై నిషేధించబడిన రసాయన ఆయుధాలను వినియోగించేందుకు ఇగోర్‌ కిరిలోవ్‌ పర్మిషన్లు జారీ చేశారని ఇటీవలే ఉక్రెయిన్ ఆరోపణలు చేసింది. ఆయన్ని యుద్ధ నేరస్థుడిగా పరిగణిస్తున్నామని ప్రకటించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే అతడిని లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. చివరికి ఈ దాడిలో కిరిలోవ్‌తో పాటు ఆయన సహాయకుడు కూడా మృతి చెందారు. దాదాపు మూడేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంమలో రష్యా కోల్పోయిన అత్యంత సీనియర్ స్థాయి అధికారి ఈయనే. అంతేకాదు ఇటీవలే రష్యాకు చెందిన ఓ ఆయుధాల నిపుణులు కూడా తన సొంత ఇంట్లో హత్యకు గురయ్యాడు. 
ఇదిలాఉండగా.. ఇగోర్‌ కిరిలోవ్‌ 2017 నుంచి రష్యా న్యూక్లియర్, జీవ రసాయన రక్షణ దళానికి చీఫ్‌గా ఉన్నారు. ఉక్రెయిన్‌ సైన్యంపై నిషేధిత రసాయనాలను విడుదల చేస్తున్నారని.. దీని ప్రభావం వల్ల అనేకమంది అనారోగ్యం పాలయ్యారని ఉక్రెయిన్ భద్రతా విభాగం ఎస్‌బీయూ గతంలోనే పేర్కొంది. దీంతో కిరిలోవ్‌పై బ్రిటన్‌ కూడా ఆంక్షలు విధించింది. రష్యా తరఫున అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తిగా ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలను వినియోగిస్తున్నామనే వార్తలను రష్యా ఖండిస్తోంది. ఉక్రెయిన్‌ సైన్యం కూడా ఇలాంటి దాడులకు ప్రయత్నాలు చేస్తూందటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Woman Attack: షాకింగ్ వీడియో.. మహిళను పైకి లేపి నేలకేసి ఎలా కొట్టారో చూశారా?

సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో ఒక మహిళను మరో నలుగురు మహిళలు అతి దారుణంగా కొట్టడం చూడవచ్చు. జుట్టు పట్టుకుని, పిడుగుద్దులతో చితకబాదారు. ఆమెను పైకి లేపి నేలకేసి కొట్టారు. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.

New Update
viral news

viral news

Woman Attack: మహిళలు ఒక్కసారి గొడవ పడ్డారంటే.. అది పూర్తయ్యేవరకు విడిచి పెట్టరు. నడి రోడ్డుపై సైతం తన్నుకునేందుకు ముందుంటారు. జనాలు ఉన్నారని చూడరు. ఎవరుంటే తమకేమి అన్నట్లు ప్రవర్తిస్తారు. జుట్లు పట్టుకుని బాదుకుంటారు. బట్టలు చిరిగేలా కొట్టుకుంటారు. ఆ సమయంలో వారిని ఆపడం చాలా కష్టం. ఇప్పటి వరకు చాలానే అలాంటి సంఘటనలు చూశాం. తాజాగా మరొకటి జరిగింది. 

మహిళపై దాడి

ఒక మహిళ నడుచుకుంటూ తిన్నగా తన ఇంటికి వెళ్తుండగా.. వేరొక మహిళ ఆమె ముందుండి నడుచుకుంటూ వెళ్తుంది. అలా కొంత దూరం నడిచి వెళ్తుండగా.. సడెన్‌గా ఇంకొందరు మహిళలు వచ్చి ఆమెపై దాడి చేశారు. దాదాపు నాలుగురు లేదా ఐదురుగు మహిళలు కలిసి ఒక మహిళను అతి దారుణంగా చితకబాదారు. 

Also Read: ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆ మహిళను జుట్టు పట్టుకుని.. పిడి గుద్దులతో ఎంత గుద్దినా.. తిరిగి చేయి ఎత్తలేదు. దెబ్బలు కాస్తున్నా తిన్నగా ఇంటివైపు నడుచుకుంటూ వెళ్లిపోయింది. సరిగ్గా అప్పుడే ఒక అబ్బాయి వచ్చి ఆ మహిళను అమాంతంగా పైకి లేపి కిందికి విసిరేశాడు. అప్పుడు కూడా ఆ మహిళ ఏం అనకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

viral-video | viral-news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment