Trump tariff impact: పన్నులు విధానంలో ట్రంప్ చైనాకు హ్యాండ్.. భారత్‌కు షేక్ హ్యాండ్ !

ట్రంప్ టారిఫ్ విధింపు అన్నీ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇండియాపై 26శాతం, చైనాపై 34% టారిఫ్ విధించింది. దీంతో అమెరికా మార్కెట్‌లో చైనా వస్తువులకంటే భారతీయ వస్తువులకే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీనికి అమెరికా, ఇండియాల ఫ్రెండ్షిపే కారణం.

New Update
trump tax on india

trump tax on india Photograph: (trump tax on india)

టారిఫ్స్ విషయంలో అమెరికా అన్నీ దేశాలపై కఠిన వైఖరి అవలంభిస్తుంది. కానీ అమెరికాకు భారత్‌తో మంచి దౌత్యసంబంధాలు ఉన్నాయి. ఈక్రమంలోనే భారత్‌పై అమెరికా ఇతర దేశాలకంటే తక్కువ పన్నులు విధించింది. అమెరికాలోకి దిగుమతి అయ్యే భారతీయ ఉత్పత్తులలై ట్రంప్ కొత్త టారిఫ్స్ కింద 26 శాతం పన్ను విధించబడనుంది. కానీ ఈ తీవ్రత ట్రంప్ చైనాపై విధించిన 34 శాతం కంటే తక్కువగా ఉండటమే కలిసొస్తోన్న విషయం. ట్రంప్ అధిక టారిఫ్స్ కారణంగా డ్రాగన్ దేశం అమెరికా మార్కెట్లలో తన వస్తువులను గతంలో కంటే ఎక్కువగా విక్రయించాల్సి ఉంటుంది. అంటే ఒక విధంగా ఇండియా ఉత్పత్తుల కంటే కూడా ఈ ధరలు అధికంగా ఉంటాయి. ఈ పరిస్థితులు అమెరికా మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు చవక రేట్లకు ఆఫర్ చేయటానికి దోహదపడుతుంది.

చైనాపై అధిక పరస్పర పన్నులను అమెరికా ప్రకటించటం వల్ల.. భారత వస్త్ర పరిశ్రమ, ఫుట్‌వేర్, ఫ్యాషన్, టెక్స్ టైల్ రంగాల ఉత్పత్తులు ఎక్కువగా అమెరికాకు షిప్మెంట్ చేసేందుకు అవకాశాలు పెరిగాయని భారత ప్రభుత్వ వర్గాలు ప్రస్తుత పరిస్థితుల అధ్యయనం ద్వారా వెల్లడించాయి. ఇదే క్రమంలో ఇండియా తన ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తులను చైనా కంటే తక్కువ రేట్లకు అమెరికాకు ఎగుమతి చేయటానికి వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. 

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫిబ్రవరిలోనే భారత ప్రధాని మోదీ యూఎస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఈసారి అధిక పన్నుల దిశగా వెళ్లాలని నిర్ణయించినందున ముందుగానే చర్చల్లో పాల్గొనటం ప్రస్తుతం పరస్పర సుంకాల్లో కొంత తక్కువ రేట్ల ప్రకటనకు దారితీసిందనే వాదనలు కూడా ఉన్నాయి. మిత్రదేశంగా ఉన్న భారత్ పై ట్రంప్ సుంకాలు కొత్త వ్యాపార అవకాశాలను కూడా తీసుకురావటం గమనార్హం. భారత్ అమెరికా ఉత్పత్తులపై కొనసాగిస్తున్న భారీ సుంకాలు.. అమెరికన్ కంపెనీలు తమ ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించడాన్ని కష్టతరంగా, ఖరీదైనదిగా మార్చుతోందని వైట్ హౌస్ అప్పట్లో చేసిన ప్రకటనలో పేర్కొంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Woman Attack: షాకింగ్ వీడియో.. మహిళను పైకి లేపి నేలకేసి ఎలా కొట్టారో చూశారా?

సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో ఒక మహిళను మరో నలుగురు మహిళలు అతి దారుణంగా కొట్టడం చూడవచ్చు. జుట్టు పట్టుకుని, పిడుగుద్దులతో చితకబాదారు. ఆమెను పైకి లేపి నేలకేసి కొట్టారు. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.

New Update
viral news

viral news

Woman Attack: మహిళలు ఒక్కసారి గొడవ పడ్డారంటే.. అది పూర్తయ్యేవరకు విడిచి పెట్టరు. నడి రోడ్డుపై సైతం తన్నుకునేందుకు ముందుంటారు. జనాలు ఉన్నారని చూడరు. ఎవరుంటే తమకేమి అన్నట్లు ప్రవర్తిస్తారు. జుట్లు పట్టుకుని బాదుకుంటారు. బట్టలు చిరిగేలా కొట్టుకుంటారు. ఆ సమయంలో వారిని ఆపడం చాలా కష్టం. ఇప్పటి వరకు చాలానే అలాంటి సంఘటనలు చూశాం. తాజాగా మరొకటి జరిగింది. 

మహిళపై దాడి

ఒక మహిళ నడుచుకుంటూ తిన్నగా తన ఇంటికి వెళ్తుండగా.. వేరొక మహిళ ఆమె ముందుండి నడుచుకుంటూ వెళ్తుంది. అలా కొంత దూరం నడిచి వెళ్తుండగా.. సడెన్‌గా ఇంకొందరు మహిళలు వచ్చి ఆమెపై దాడి చేశారు. దాదాపు నాలుగురు లేదా ఐదురుగు మహిళలు కలిసి ఒక మహిళను అతి దారుణంగా చితకబాదారు. 

Also Read: ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆ మహిళను జుట్టు పట్టుకుని.. పిడి గుద్దులతో ఎంత గుద్దినా.. తిరిగి చేయి ఎత్తలేదు. దెబ్బలు కాస్తున్నా తిన్నగా ఇంటివైపు నడుచుకుంటూ వెళ్లిపోయింది. సరిగ్గా అప్పుడే ఒక అబ్బాయి వచ్చి ఆ మహిళను అమాంతంగా పైకి లేపి కిందికి విసిరేశాడు. అప్పుడు కూడా ఆ మహిళ ఏం అనకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

viral-video | viral-news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment