గాల్లో ఆగిపోయిన రెయిలర్ కోస్టర్, భయపడిన టూరిస్టులు

దక్షిణ ఇంగ్లండ్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ట్రావెల్ చేస్తున్న కొంతమంది పర్యాటకులు క్యాబిన్‌లో స్ట్రక్ అయిపోయింది. తలకిందులుగా వేలాడుతూ భయాందోళనకు గురయ్యారు అందులో ఉన్న పర్యాటకులు. అమ్యూజ్‌మెంట్ పార్క్ సిబ్బంది రంగంలోకి దిగి ఇరుక్కున్న పర్యాటకులను సురక్షితంగా కిందకు దించారు.దీంతో పెనుప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

New Update
గాల్లో ఆగిపోయిన రెయిలర్ కోస్టర్, భయపడిన టూరిస్టులు

రోలర్ కోస్టర్ రైడ్ అంటే కొంతమందికి మహా సరదా. ఎత్తు పల్లాల్లో వేగంగా దూసుకుపోయే ఈ రైడ్‌లో ప్రయాణిస్తుంటే ప్రాణం గాల్లో తేలియాడుతూ మహా ఆనందంగా ఉంటుంది.కానీ ఇదే రోలర్ కోస్టర్ రైడ్‌లో ఏదైనా అపశ్రుతి దొర్లితే మాత్రం ప్రమాదం ఊహకు కూడా అందదు అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చాలా అరుదు. కానీ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడే చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.ప్రాణనష్టం కూడా జరుగుతుంది.

View this post on Instagram

A post shared by @vedhamalhotra

లక్కంటే మీదే భయ్యా! అంటూ నెటిజన్ల కామెంట్లు

మన పెద్దవాళ్లు చెప్పినట్టు అదృష్టం బాగుంటే బతికి బట్టకడుతారు అంటారు కదా. అచ్చంగా అలాంటి ప్రమాద అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నారు లండన్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్న పర్యాటకులు. ఈ రోలర్ కోస్టర్ మొదలైనప్పుడు మొదట భూమికి లంబంగా పైకి వెళ్తుంది. ఇక అక్కడి నుండి కిందకి జారుకుంటూ రివ్వున జెట్‌ స్పీడ్‌లో దూసుకొస్తుంది. కానీ ఇది పైకి వెళ్తున్నప్పుడు భూమికి సుమారు 72 అడుగుల ఎత్తులో సాంకేతిక సమస్యలతో సడెన్‌గా ఆగిపోయింది.

ఇరుక్కుపోయిన మహిళలు, పిల్లలు

ఇందులో ట్రావెల్ చేస్తున్న మహిళా తన ఆరేళ్ళ కుమార్తెతో సహా ఇరుక్కుపోయింది. ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి. పర్యాటకులంతా బిక్కుబిక్కుమంటూ గుటకలు మింగుతూ పైనే అరుస్తూ ఉండిపోయారు. వీరికేదైనా జరగరానిది జరిగి పట్టు తప్పితే మాత్రం అమాంతం కిందకి వచ్చేలోపే వారి ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. అదృష్టవశాత్తు ఆ అమ్యూజ్‌మెంట్ పార్క్ సిబ్బంది సమయానికి స్పందించి ఘటనాస్థలానికి చేరుకొని అందులో చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా కిందకు దించారు.దీంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు లక్కంటే మీదే భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్

భారత్ పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు.నేను ఆ రెండు దేశాలకూ మంచి స్నేహితుడునే.కశ్మీర్‌ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది.ఆ రెండు దేశాలే దాన్ని ఎలాగోలా పరిష్కరించుకుంటాయని అన్నారు

New Update
Donald Trump

Donald Trump

భారత్ పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు.నేను ఆ రెండు దేశాలకూ మంచి స్నేహితుడునే.కశ్మీర్‌ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది.ఆ రెండు దేశాలే దాన్ని ఎలాగోలా పరిష్కరించుకుంటాయి.ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న మాట నిజమే.కానీ అవి ఎప్పుడూ ఉన్నాయిగా అని వ్యాఖ్యానించారు.కాగా..పాక్‌ ఏర్పడింది.1947 లో అని కూడా ట్రంప్‌ కు తెలీదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టి విమర్శిస్తున్నారు.

Also Read: BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని

ఇదిలా ఉంటే..జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ప్రధాని మోడీ కి ట్రంప్‌ ఫోన్‌ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహరాల శాఖ అధికార ప్రతినిధి  జైస్వాల్‌ సోషల్‌ మీడియాలో తెలియజేశారు. '' ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు.

Also Read: Realme 14T 5G: రియల్‌మి నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. సేల్ షురూ - ధర, ఆఫర్ల వివరాలివే!

ఉగ్రదాడిలో బలైన వారికి ట్రంప్‌  సంతాపం తెలియజేశారు. ఉగ్ర దాడి ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని జైస్వాల్‌ పేర్కొన్నారు.ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్‌ అన్నారు. ఉగ్రవాద పోరులో అమెరికా, భారత్‌ ఒకరికొకరు కలిసి పోరాడతాయని ఎక్స్‌ లో రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

ట్రంప్ ఫోన్ చేసి మద్ధతుగా మాట్లాడడంతో ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్‌ కృత నిశ్చయంతో ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. అంతకు ముందే ఇదే విషయమై ట్రంప్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్‌ ఉగ్ర ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు,.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మోడీకి, భారతప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

Also Read:AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

Also Read: Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి

trump | kashmir | Jammu and Kashmir | india | latest-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment