USA: అమెరికాలో తండ్రి చనిపోయినట్లు నాటకమాడాడు.. చివరికి

అమెరికాలో ఓ విద్యార్థి స్కాలర్‌షిప్‌ కోసం తండ్రి చనిపోయిట్లు నాటకమాడాడు. చివరికి ఇది బయటపడంతో అతడిని అధికారులు బహిష్కరించారు. మరికొన్ని రోజుల్లో అతడు ఇండియాకు రానున్నాడు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
USA: అమెరికాలో తండ్రి చనిపోయినట్లు నాటకమాడాడు.. చివరికి

అమెరికాలో ఓ విద్యార్థి స్కాలర్‌షిప్‌ కోసం తండ్రి చనిపోయిట్లు నాటకమాడాడు. చివరికి ఇది బయటపడంతో అతడిని అధికారులు బహిష్కరించారు. మరికొన్ని రోజుల్లో అతడు ఇండియాకు రానున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన ఆర్యన్ ఆనంద్‌ అనే విద్యార్థి 2023 ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ లేహీలో ప్రవేశం పొందాడు. దీంతో అతడు స్కాలర్‌షిప్‌ కోసం తప్పుడు మార్గాన్ని అనుసరించాడు. తన తండ్రి బతికే ఉన్నప్పటికీ.. ఆయన చనిపోయినట్లు డెత్‌ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. ఇలా ఏడాది గడిచిపోయింది.

Also Read: హోరాహోరీగా ట్రంప్ – బైడెన్ మధ్య డిబేట్

ఇటీవల అసత్యాలతోనే నా జీవితాన్ని నిర్మించుకున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. తన పదో తరగతి బోర్డు ఫలితాలను తారుమారు చేసిన తీరు.. తప్పుడు డాక్యుమెంట్స్‌తో అమెరికాలో ఎలా చదివానని చెప్పాడు. చదువుపై ఆసక్తి లేకపోవడం, స్కాలర్‌షిప్‌ కోసం పరీక్షల్లో మోసానికి పాల్పడటం అలాగే తప్పుడు ఇంటర్న్‌షిప్‌ల గురించి వివరించాడు. అయితే ఈ విషయం అక్కడి అధికారులకు తెలిసింది. దీంతో జూన్ 12న ఆర్యన్‌ ఆనంద్‌ను అరెస్టు చేశారు. వాస్తవానికి ఈ కేసులో అతడికి 20 ఏళ్ల వరకు జైలు శిక్షపడే ఛాన్స్ ఉంది. కానీ యూనివర్సిటీ అధికారుల అభ్యర్థన మేరకు అతడిపై బహిష్కరణ వేటు పడింది. మరికొన్ని రోజుల్లోనే అతడు ఇండియాకు తిరిగిరానున్నట్లు తెలుస్తోంది.

Also read: రాజుల కోసం కాదు, రాణుల కోసం కట్టిన ప్యాలెస్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు..పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్

పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ ఆర్మీ ఛీఫ్ మునీర్ వ్యాఖ్యలే కారణమంటున్నారు. దీనిపై తాజాగా పెంటగాన్ మాజీ అధికారి రూబిన్ స్పందించారు. మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడని అన్నారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి పాకిస్తాన్ పక్కా ప్రణాళిక అని రూబిన్ ఆరోపించారు. 

author-image
By Manogna alamuru
New Update
usa

Pak Army Chief Asif Munir, Osama bin Laden

ఒక పందికి లిప్ స్టిక్ వేసినా అది పందేనని మాజీ పెంటగాన్ అధికారి మైఖల్ రూబిన్  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది పాకిస్తాన్ గురించి ఆయన చెప్పిన మాటలు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పాకిస్థాన్ పక్కా ప్రణాళికతో నిర్వహించిందని రూబిన్ ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ ను చనిపోయిన అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ లాంటివాడని అన్నారు. అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్ ఫెలో అయిన రూబిన్ ఎన్ఐఏకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పహల్గామ్ దాడికి అమెరికా తీసుకోవాల్సిన చర్య ఒకే ఒక్కటి ఉంది. అది పాక్ ను అధికారికంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా గుర్తించడమే అని అన్నారు. బిల్ క్లింటన్ ఇండియా వెళ్ళినప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడ ఉన్నప్పుడే ఉగ్రవాదులు దాడి చేశారు. ఇదంతా పాకిస్తాన్ దృష్టిని మళ్ళించేందుకే చేస్తోందని రూబిన్ అన్నారు. 

కాశ్మీర్ మాది అంటూ వ్యాఖ్యలు..

కాశ్మీర్ లోని పహల్గామ్ దాడికి వారం రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ కాశ్మీర్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అని..దానిని తాము ఎప్పటికీ వదులుకోమని అన్నారు. ఈ మాటలే ఉగ్రవాదులకు ఊతమిచ్చాయని..ఆ ధైర్యంతోనే వారు కాశ్మీర్ లో దాడులకు తెగబడ్డారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు పెంటగాన్ మాజీ అధికారి కూడా ఈ వాదనను సమర్థించారు. 

పహల్గామ్‌లోని బైసరన్ లోయలో  లష్కరే తొయిబా అనుబంధ విభాగం టీఆర్ఎఫ్ టెర్రరిస్టులు.. పర్యాటకులపై కాల్పులకు తెగబడి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరో 20 మందిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 

today-latest-news-in-telugu | usa | pakistan | pentagon | Pakistan Army Chief | osama-bin-laden 

 

Also Read: USA: వీసాల రద్దు ఆపండి..విద్యార్థులకు అమెరికా న్యాయస్థానం ఊరట

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు