IND vs ENG : ఆ ఇద్దరు ఎందుకు? సమాధానం చెప్పండి ద్రవిడ్‌!

ఇంగ్లండ్‌పై హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో గిల్, శ్రేయస్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు చివరి 11 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక 50కూడా కొట్టలేదు.

New Update
IND vs ENG : ఆ ఇద్దరు ఎందుకు? సమాధానం చెప్పండి ద్రవిడ్‌!

Shubman Gill and Shreyas Iyer Flop Show : పుజారా(Pujara), రహానే(Rahane) వద్దు.. ఎందుకంటే ఏజ్‌ అయిపోయిందని చెబుతున్నారు. వారిలో ఇంకా ఆడే సత్తా ఉన్నా పక్కన పెట్టేశారు. ఎందుకంటే భవిష్యత్‌ ప్రణాళికల బూచీ చూపించారు. సరే.. మన టీమిండియా(Team India) ఫ్యూచర్‌ బాగుండడం కోసమేలే అని ఫ్యాన్స్ సర్ధి చెప్పుకున్నారు. వెటరన్ల ప్లేస్‌లో యువకులు నిండిపోవడంతో మురిసిపోయారు. సీన్‌ కట్ చేస్తే యువ రక్తం ముసలిగా కనిపిస్తోంది. ఆడలన్నా కసి, గెలవాలన్న సంకల్పం ఆ ఇద్దరిలో అసలు కనిపించడంలేదు. మరో సచిన్‌, మరో కోహ్లీ అంటూ క్రికెట్ కెరీర్‌ మొదటి నుంచే హైప్‌ తెచ్చుకున్న శుభమన్‌గిల్‌ టెస్టుల్లో ఘోరంగా ఆడుతున్నాడు. అటు శ్రేయస్‌ అయ్యర్‌కు బిల్డప్‌లు ఎక్కువ ఆట తక్కువ అన్నట్టుంది పరిస్థితి. అతనేంటో అతని విధానాలేంటో అంతుచిక్కడం లేదు. అయినా ఈ ఇద్దరినే ఆడిస్తోంది బీసీసీఐ.


అట్టర్‌ ఫ్లాప్‌ షో:
శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) లాస్ట్‌ 11 ఇన్నింగ్స్‌(4 , 12 , 0 ,26 ,0 , 31 ,6 , 0, 4 ,31 ,0).. చూశారు కదా.. అఫ్రిది తమ్ముడిలా ఉన్నాడు. నాలుగు గుడ్డు సున్నాలు ఉన్నాయి. ఒక హాఫ్‌ సెంచరీ కూడా లేదు. అత్యధిక స్కార్ 31 మాత్రమే. అటు బాడీ లాంగ్వేజ్‌ చూస్తే అసలు ఆడలాన్న ఇంట్రెస్టు ఉన్నట్టే అనిపించదు. అవుటైతే కనీసం బాధ పడడు.


మరోవైపు ఎంతో టాలెంట్ ఉన్నా.. టెక్నిక్‌ అద్భుతంగా ఉన్నా టెస్టుల్లో మాత్రం శుభమన్‌గిల్(Shubman Gill) ఫెయిల్ అవుతుండడం కలవర పెడుతోంది. గతేడాది వన్డేల్లో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన గిల్‌ టెస్టుల్లో మాత్రం ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. శుభమన్‌గిల్ చివరి 11 ఇన్నింగ్స్‌(13 ,18 ,6 ,10 ,29 ,2 , 26 ,10 ,36, 23 , 0).. ఇందులో ఒక హాఫ్‌ సెంచరీ కూడా లేదు. అత్యధిక స్కోరు 36 మాత్రమే. ఇక తాజాగా ఇంగ్లండ్‌పై జరిగిన తొలి టెస్టులోనూ ఈ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. భారత్‌ ఓటమికి ప్రధాన కారణాల్లో ఈ ఇద్దరూ ఉన్నారు.

Also Read: హ్యాట్రిక్‌ విజయాలతో అదరగొట్టిన టీమిండియా.. అండర్‌-19లో యూఎస్‌పై భారీ విజయం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGSRTC: తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన టీజీఎస్‌ ఆర్టీసీ!

గ్రేటర్ హైదరాబాద్‌లో జూలై నాటికి అదనంగా 200 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వీటిలో 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి.

New Update
tgrtc

హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు టీజీఎస్‌ రోడ్డు రవాణా సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే జులై నాటికి 200 కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త బస్సుల్లో దాదాపు 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండటం విశేషం.

Also Read: BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి చేరింది. ముఖ్యంగా ఉదయం.. సాయంత్రం రద్దీ సమయాల్లో సిటీ బస్సులు అధిక లోడ్‌తో నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు మరింత మందిని ఆకర్షించాలంటే కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అంటున్నారు.

Also Read: BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్

అవసరమైన నిధుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బ్యాంకులను సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో రోజూ 23 నుంచి 24 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.వీరిలో 14 నుంచి 15 లక్షల మంది మహిళలే అధికంగా ఉన్నారు. ఈ గణాంకాలు నగరంలో ప్రజా రవాణా ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో టీఎస్‌ఆర్టీసీ ముందుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ప్రస్తుతం 3,100 బస్సులు నడుస్తుండగా.. రానున్న రోజుల్లో  పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపాలని ప్రభుత్వం అనుకుంటుంది. 2025 డిసెంబర్ నాటికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను గ్రేటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలోనే గ్రేటర్ జోన్‌లోని 25 బస్ డిపోల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఈ చర్యలు నగరంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా.. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయని అధికారులు అనుకుంటున్నారు.

Also Read: BIG BREAKING: పాక్ కి భారీ షాక్‌..10 మంది సైనికులు హతం!

Also Read: Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

 rtc | electric-bus | Electric busses in telangana | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment