World Cup 2023: భారత్-శ్రీలంక మ్యాచ్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక టీమ్

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకను ఓడించి...సెమీస్‌ బెర్త్‌ ను ఖాయం చేసుకోవాలనుకుంటోంది.

New Update
World Cup 2023: భారత్-శ్రీలంక మ్యాచ్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక టీమ్

India Vs Srilanka World Cup 2023: ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా ఈరోజు శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకను ఓడించి...సెమీస్‌ బెర్త్‌ ను ఖాయం చేసుకోవాలనుకుంటోంది. మరో వైపు ఆఫ్ఘాన్ చేతుల్లో ఓడిపోయిన శ్రీలంక ఈ మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటోంది.

టీమ్ ఇండియా ఆటగాళ్ళు వరల్డ్ కప్ మొదటి నుంచి విజృంభిస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. పెద్ద జట్ల మీద కూడా గెలిచి చూపించింది. అదే హవాను కొనసాగించాలనే ఊపు మీదుంది టీమ్ ఇండియా. టోర్నీ ముందుకు సాగేకొద్దీ టీమ్‌ ఇండియా బలం పెరుగుతోంది. ప్రధాన ఆటగాళ్లందరూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. హార్దిక్‌ పాండ్య దూరం కావడంతో జట్టులో ఛాన్స్ చేజిక్కించుకున్న ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి, మిడిలార్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం సత్తా చాటారు. ఒక్క శ్రేయస్ అయ్యర్ మాత్రమే ఇప్పటి వరకు తన ప్రతిభ చూపించలేకపోతున్నాడు. మరోవైపు శుభ్ మన్ గిల్ (Shubman Gill) కూడా తన సూపర్ ఆటను చూపించలేదు ఇప్పటివరకు. కానీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) సూపర్‌ ఫామ్‌తో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కోహ్లి (Virat Kohli) కూడా చాలా బాగా ఆడుతున్నాడు. రాహుల్‌ కూడా మిడిలార్డర్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడె పిచ్‌పై భారీ స్కోరు చేయడానికి భారత్‌కిది మంచి అవకాశమే. బౌలింగ్‌లో భారత్‌కు పెద్ద సమస్యలేమీ లేవు. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన షమి చెలరేగిపోతుంటే.. బుమ్రా, కుల్‌దీప్‌, జడేజా నిలకడను కొనసాగిస్తున్నారు. సిరాజ్ కూడా దుమ్ము దులుపుతున్నాడు.

Also Read: ఈ ఫొటోకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది..సచిన్ ఎమోషనల్ పోస్ట్..!

ప్రపంచకప్‌లో శ్రీలంక, బారత్ 9 సార్లు ఎదురెదురుపడగా.. భారత్‌ 4, శ్రీలంక 4 విజయాలతో సమంగా ఉన్నాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం​ రాలేదు. ఇక వాంఖడే పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంటుంది.  ఇక్కడ మొదట బ్యాటింగ్‌ చేసే జట్లు 350కు పైగా పరుగులు చేసే అవకాశం ఉంది.

తుది జట్లు..

భారత్..

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రీయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, బుమ్రా, కులదీప్ యాదవ్, మహ్మద్ షమీ.

శ్రీలంక...
పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!

రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ కూల్చాలని కోరుతున్నారంటూ దుమారం రేపారు.

New Update

TG News: రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అన్నారు. అంతేకాదు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారంటూ దుమారం రేపారు. 

కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది..

ఈ మేరకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదు. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. సర్పంచులకు బిల్లులు రాక లబో దిబోమని మొత్తుకుంటున్నారని, ఇళ్లు, డ్రైనేజీలు కట్టినవారు బిల్లులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ పది జిల్లాల్లో దుబ్బాక అంత దారుణంగా ఏదీ లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

పొంగులేటి కౌంటర్..

అయితే ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 'ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన. గవర్నమెంట్ కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన. ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి. తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భూభారతి అమలు చేసి తీరుతాం' అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. 

kotta-prabhakar | cm revanth | brs | congress | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment