IND vs AFG: కేఎల్‌రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ని ఎందుకు సెలక్ట్ చేయలేదు?

అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్, కోహ్లీని ఎంపిక చేసిన బీసీసీఐ.. కేఎల్‌రాహుల్‌ని మాత్రం పక్కన పెట్టడంపై ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు శ్రేయస్‌ అయ్యర్‌ని కూడా సెలక్ట్ చేయలేదు. ఇషాన్‌ కిషాన్‌పై వేటు పడినట్టుగా అర్థమవుతోంది.

New Update
IND vs AFG: కేఎల్‌రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ని ఎందుకు సెలక్ట్ చేయలేదు?

అఫ్ఘానిస్థాన్‌(Afghanistan)పై జనవరి 11 నుంచి సిరీస్‌ మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ టీ20 సిరీస్‌ కోసం భారత్‌ జట్టును ప్రకటించగా.. అందులో పలువురు కీలక ఆటగాళ్ల పేరు కనపడలేదు. ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌(KL Rahul), శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) పేర్లు లేకపోవడం ఫ్యాన్స్‌ని కన్ఫూజ్‌ చేస్తోంది. ఈ ఇద్దరూ ఆటగాళ్లు ఫామ్‌లోనే ఉన్నారు. నిజానికి రాహుల్‌ 2022 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత భారత్‌ పొట్టి ఫార్మెట్ జట్టులో కనిపించలేదు. రోహిత్‌, కోహ్లీ కూడా అప్పటినుంచి ఇండియా తరుఫున టీ20ల్లో పాల్గొనలేదు. అయితే రోహిత్‌, కోహ్లీని అఫ్ఘాన్‌ సిరీస్‌కు ఎంపిక చేసిన సెలక్టర్లు రాహుల్‌ని మాత్రం సెలక్ట్ చేయలేదు. అయితే ఇది వేటుగా కాకుండా కేవలం రెస్ట్‌గా భావించాల్సి ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

అయ్యర్‌ ఎందుకు లేడు?
ఇటీవలి జరిగిన వన్డే ప్రపంచకప్‌లో శ్రేయస్‌ అయ్యన్ మిడిలార్డర్‌లో అద్భుతంగా రాణించాడు. ఇక ఈ క్రమంలోనే టెస్టు జట్టులో కూడా స్థానం సంపాదించాడు. అయితే తాజాగా ముగిసిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో అయ్యర్ ఫెయిల్ అయ్యాడు. ఇక ఈ నెలలొనే ఇంగ్లండ్‌తో భారత్‌ టెస్టు సమరానికి సిద్ధం అయ్యింది. 5 టెస్టుల సిరీస్‌ స్వదేశంలో జరగనుంది. ఈ మధ్యలో జనవరి 11 నుంచి అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌లకు అయ్యర్‌ని పక్కన పెట్టారు సెలక్టర్లు. దీనికి ఎలాంటి కారణాలు చెప్పలేదు. ఇది ఫ్యాన్స్‌ను కాస్త పజీల్‌లో పెట్టింది. టీ20లకు అయ్యర్‌ను సెలక్టర్లు కన్సీడర్‌ చేయలేదా లేకపోతే జస్ట్ రెస్ట్ ఇచ్చారా అన్నది తేలాల్సి ఉంది.

గాయాలతో ఔట్:
మరోవైపు బుమ్రాకు మాత్రం ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకోనే అఫ్ఘాన్‌ రెస్ట్ ఇచ్చారు. అదే సమయంలో పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ గాయం కారణంగా అఫ్ఘాన్‌ సిరీస్‌కు దూరం అయ్యారు. ఇటు ఇషాన్‌కిషన్‌ని సైతం సెలక్టర్లు పట్టించుకోలేదు. జూన్‌లో టీ20 వరల్డ్‌కప్‌ జరగనుండగా.. ఈ సిరీస్‌ సెలక్షన్‌ బట్టి చూస్తే ఇషాన్‌ని టీ20 వరల్డ్‌కప్‌ కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదని అర్థమవుతోంది.

అఫ్ఘానిస్థాన్‌తో టీ20లకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఎస్ గిల్, వై జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, డబ్ల్యూ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్

Also Read: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని కొట్టిన టీడీపీ కార్యకర్తలు.. తారక్‌ ఫొటోలు విసిరిపడేశారు!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న తన ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ వరకు సమయం ఇవ్వాలని ఓ పాకిస్థానీ ఇండియా ప్రభుత్వాన్ని కోరాడు. మెరుగైన వైద్యం కోసం ఇండియాకి వచ్చామని.. మధ్యలోనే వెళ్లిపోమంటున్నారని ఆవేదన చెందాడు. చికిత్సకు ఇప్పటికే రూ.కోటి ఖర్చు అయ్యిందన్నారు.

New Update
Surgeries

Surgeries

తన ఇద్దరు పిల్లల ఆపరేషన్ కోసం ఓ పాకిస్థానీ ఇండియా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. పుట్టుక నుంచి తన ఇద్దరు పిల్లలు గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వారికి మెరుగైన వైద్యం కోసం ఇండియాకి వచ్చారు. ఇప్పుడు పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ కాకుండానే మధ్యలో వెళ్లాలంటున్నారని ఆవేదన చెందుతున్నారు. 

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

కొంత సమయం ఇవ్వాలని..

చికిత్స పూర్తి చేయడానికి అనుమతించాలని ప్రభుత్వాలను కోరాడు. ఢిల్లీలో అధునాతన చికిత్స ఉందని, అందుకే చికిత్సకు ఇండియాకు వచ్చినట్లు తెలిపాడు. ఇంకో వారం రోజుల్లో శస్త్రచికిత్స జరగనుంది. అప్పటి వరకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే పిల్లల వైద్యానికి రూ.కోటి ఖర్చు అయ్యిందని, ఇప్పుడు మధ్యలోనే చికిత్స ఆపేస్తే.. పిల్లల ప్రాణాలకే ప్రమాదమని తండ్రి ఆవేదన చెందుతున్నాడు. ఇంకో రెండు వారాల సమయం ఇస్తే చికిత్స అన్ని పూర్తి చేసుకుని వెళ్లిపోతామని తండ్రి ప్రభుత్వాన్ని కోరాడు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment