Badhrachalam: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం

గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది.

New Update
Badhrachalam: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం

Badhrachalam: గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రం మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద దీనికి తోడుగా దిగువన శబరి నదికి భారీగా వరద నీరు రావడంతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది.

ప్రస్తుతం 51 అడుగులు ఉండటంతో ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఒకవేళ వరద ఉదృతి 53 అడుగులకి చేరుకుంటే అధికారులుమూడవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు. ఇప్పటికే భద్రాచలం నుంచి వాజేడు వెంకటాపురంకి వెళ్లే రహదారులు అన్ని స్తంభించిపోయాయి. ప్రధానమైన రహదారి మీదికి తూర్పు బాకు వద్ద రోడ్డుపై గోదావరి నీళ్లు నిల్చడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని సమాచారం.

అదేవిధంగా భద్రాచలం నుంచి కూనవరం, చింతూరు, వీఆర్ పురం వెళ్లే రహదారులు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే శబరి నది స్పీడు మీద గోదావరి వరద ఆధార పడి వుంది. ప్రస్తుతం వరద నీటి ఫ్లో 53 నుంచి 55 అడుగుల వరకు గోదావరి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకి ఆదేశాలు చేశారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి గోదావరి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also read: గ్యాస్‌ గీజర్‌ లోని వాయువు పీల్చే ముగ్గురు మృతి!


Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

గ్రహాల మార్పు.. ఈ రాశుల వారికి పట్టనున్న కుభేర యోగం

ఏప్రిల్ 14వ తేదీన సూర్యభగవానుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటక, తులా రాశి వారికి కుభేర యోగం పట్టనుందని పండితులు అంటున్నారు. సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని చెబుతున్నారు.

New Update
horoscope 2025 today

horoscope 2025

కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారిక కుభేర యోగం పట్టనుంది. ఏప్రిల్ 14వ తేదీన సూర్యభగవానుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుందని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో చూద్దాం. 

మేషరాశి

సూర్యుడు మీ రాశిలోకి నేరుగా ప్రవేశించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సూర్య భగవానుడి దయవల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి దక్కే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా వృద్ధి చెందే సంకేతాలు అధికంగా ఉన్నాయి. నిరుద్యోగుల కలలు నెరవేరుతాయి.

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

మిథున రాశి
సూర్యుని సంచారం మిథున రాశి జాతకులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. వారి కెరీర్ ఊపందుకునేలా చేస్తుంది. వ్యక్తిగత జీవితంలో కూడా శుభాలు కలుగుతాయి. సూర్య అనుగ్రహంతో ఉద్యోగంలో పదోన్నతిని పొందుతారు. అలాగే ఉద్యోగుల జీతం కూడా పెరగొచ్చు. పోటీ పరీక్షలలో విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అలాగే పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు అధికంగా వస్తాయి.

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా సూర్యుని గమనం శుభప్రదంగా మారుతుంది. ఈ రాశి వారికి సామాజిక, ఆర్థిక రంగాలలో కొత్త అవకాశాలు వస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మతపరమైన వేడుకల్లో హాజరవుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకుముందు పూర్తవకుండా మిగిలిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. 

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

తులా రాశి
తులారాశి వారికి సూర్య సంచారం ఆస్తిని అందించేలా కనిపిస్తోంది. అలాగే మానసిక స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది. సూర్య సంచారం వల్ల వారికి ఏకాగ్రత పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా వస్తుంది. అలాగే భూమి, వాహనం లేదా ఆభరణాలు కొనుగోలు కూడా చేసే అవకాశం కల్పిస్తుంది. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు