IND vs AUS: ఆస్ట్రేలియా పాలిట యముడు, సిక్సర్ల వీరుడు.. ఈ సారి చితక్కొట్టేది ఎవరో..!

ఐసీసీ నాకౌట్లలో ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఇండియా నాలుగు సార్లు గెలవగా.. అందులో మూడుసార్లు యువరాజ్‌సింగ్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక నవంబర్‌ 19న జరగనున్న వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో యువరాజ్‌ స్థాయిలో ఎవరూ ఆడుతారన్నదానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

New Update
IND vs AUS: ఆస్ట్రేలియా పాలిట యముడు, సిక్సర్ల వీరుడు.. ఈ సారి చితక్కొట్టేది ఎవరో..!

ICC WORLD CUP 2023: వరల్డ్‌కప్‌(World Cup)లో ఫైనల్‌(Final) మ్యాచ్‌ గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రపంచకప్ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఓటమే ఎరగని జట్టుగా టీమిండియా(India) సెమీస్‌లో అడుగుపెడితే అటు ఆస్ట్రేలియా(Australia) కాస్త పడుతూ లేస్తూ ఒక్కసారిగా దూకుతూ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫైనల్‌లో ఎవరు గెలుస్తారో చెప్పడం సాధ్యంకాదు.. ఎందుకంటే రెండు జట్లలోని ఆటగాళ్ల టాలెంట్‌ తిరుగులేనిది. దీంతో హోరాహోరీ పోరు జరగడం ఖాయం. ఇదే సమయంలో గతంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌పై అభిమానులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాపై గతంలో జరిగిన మ్యాచ్‌లను గుర్తు చేసుకుంటున్నారు.

అతడే హీరో:
ఇప్పటివరకు ఐసీసీ నాకౌట్లలో ఆస్ట్రేలియాపై ఇండియా నాలుగుసార్లు గెలిచింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నది ఒక్కడే కావడం విశేషం. అతనే సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌(Yuvraj singh). 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై ఇండియా గెలవగా.. ఆ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా సచిన్(Sachin Tendulkar) అవార్డు అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఐసీసీ నాకౌట్‌లలో గెలిచిన మూడు సార్లు కూడా యువరాజే హీరో. ప్రతీసారి కంగారులను కంగారు పెట్టించాడు యువీ. 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై యువీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కగా.. ఇక 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై యువీ ఆడిన గేమ్‌ను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ మ్యాచ్‌లో 30 బంతుల్లోనే 70 రన్స్ చేసిన యువరాజ్‌ ఆస్ట్రేలియాను దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించాడు.

ఇంటికి పంపాడు:
1999,2003,2007 ప్రపంచకప్‌ల్లో హ్యాట్రిక్‌ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు 2011లో మాత్రం క్వార్టర్స్‌లోనే వెనుతిరిగింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 260 రన్స్ చేసింది. కెప్టెన్ పాంటింగ్‌ సెంచరీతో రాణించాడు. ఇక లక్ష్యఛేదనలో సెహ్వాగ్‌ వికెట్‌ను త్వరగానే కోల్పోయినా సచిన్‌, గంభీర్‌ హాఫ్‌ సెంచరీతో స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఇద్దరూ ఔటైన తర్వాత రైనా, యువరాజ్‌ జట్టును గెలిపించారు. 65 బంతుల్లో 57 పరుగులు చేశాడు యువీ.. బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీశాడు. ఇక నవంబర్‌ 19న జరగనున్న మ్యాచ్‌లో యువరాజ్‌ స్థాయిలో ఎవరూ ఆడుతారన్నదానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ఇండియా కప్ గెలవాలంటే..ఆ మొనగాడే ముఖ్యం

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment