Telangana IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 23 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Telangana IAS Transfers: తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి (CS Santhi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. ALSO READ: కరెంట్ కట్ చేస్తే ఉద్యోగాలు ఫట్.. సీఎం రేవంత్ వార్నింగ్ * సిద్దిపేట (Siddipet) జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ * సిద్ధిపేట నూతన కలెక్టర్ గా కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని (Mikkilineni Manu Choudary) నియమించింది. * వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాను జనగాం జిల్లా కలెక్టర్గా బదిలీ చేసింది. * అలాగే వరంగల్ (Warangal) జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. * ప్రస్తుత పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్కు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించింది. ఇంతకాలం ఆ బాధ్యతలు (అదనపు హోదాలో) చూస్తున్న సునీల్ శర్మను అక్కడి నుంచి రిలీవ్ చేసింది రాష్ట్ర సర్కార్. DO WATCH: #cm-revanth-reddy #telangana-government #telangana-latest-news #cs-shanthi-kumari #telangana-ias-transfers సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి