Jagan: మిస్ యూ చెల్లెమ్మా..షర్మిల పై జగన్ ఆసక్తికర విషయాలు! By Bhavana 04 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ap: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె అన్నయ్య వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చెల్లిని మిస్ అవుతున్నట్లు చెప్పారు. మీ చెల్లిని మీరు మిస్ అవుతున్నారా అన్న యాంకర్ అడిగిన ప్రశ్నకు సీఎం జగన్.. కచ్చితంగా మిస్సవుతున్నా అని సమాధానం ఇచ్చారు. కానీ, దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్లిందన్నారు. కానీ ఆ ప్రేమలు ఎక్కడికి పోతాయి అని బదులిచ్చారు. తమ కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్లోకి వెళ్లిన షర్మిలకు డిపాజిట్లు కూడా రావని జగన్ పేర్కొన్నారు. షర్మిల చంద్రబాబుతో కలిసి ఆయన చెప్పినట్లు చేస్తోందన్నారు. షర్మిలను, ఏపీ కాంగ్రెస్ను రేవంత్ ద్వారా చంద్రబాబు నడిపిస్తున్నారని చెప్పారు. తన కుటుంబ సభ్యురాలై ఉండి బయటకు వెళ్లడం.. శత్రువులతో చేతులు కలపడం బాధ కలిగించే విషయమే అని జగన్ అన్నారు. Also read: హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య #politics #jagan #ycp #sharmila #congress సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి