Hyderabad: హైదరాబాద్‌లో ఈరోజు భారీ వర్షం..జీహెచ్ఎంసీ హెచ్చరిక

సాయంత్రం బయటకు వెళుతున్నారా...పనులు చేసుకుందామనుకుంటున్నారా...అయితే అవన్నీ వెంటనే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వష్ం పడనుంది. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ హెచ్చరించారు.

New Update
Weather Alert: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం

Huge Rain In Hyderabad : మాన్‌సూన్ (Monsoon) వచ్చేసింది. అప్పుడప్పుడూ వర్షాలు (Rains) పడుతున్నాయి. ఒక్కోసారి పెద్ద వానల ముంచుకొస్తున్నాయి. హైదరాబాద్‌ (Hyderabad) కు మళ్ళీ భారీ వర్షం తరుముకొచ్చేస్తోంది. ఈరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఇక్కడ అతి పెద్ద వర్షం పడనుంది. ఆగకుండా కూడా వాన కురవచ్చని వాతావరణశాఖ తెలిపింది. దీంతో సాయంకాలం నుంచి ఎవరూ బయటకు రావోద్దని హెచ్చరిస్తోంది జీహెచ్ఎంసీ.

బయటకు రావొద్దు.. 

అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు. ఆఫీస్‌, ఇతర పనుల మీద బటయకు వెళ్ళినవారు తొందరగా ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వచ్చేస్తే మంచిదని హెచ్చరించారు. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడే సూచన ఉంది కావున శిథిల భవనాలు, చెట్ల కింద ఉండొద్దని చెబుతోంది జీహెచ్ఎంసీ (GHMC). అత్యవసర సమయాల్లో సహాయం కోసం 90001 13667 నంబర్‌కు కాల్‌ చేయాలని తెలిపింది.

Also Read:Russia: రష్యాలో నదిలో మునిగి నలుగురు భారత విద్యార్ధులు మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

మధ్యప్రదేశ్‌ లో ఓ వింత దొంగతనం జరిగింది. అప్పుల వాళ్ల బాధలు భరించలేక దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.అంతేకాకుండా తనని క్షమించాలని,ఆరు నెలల్లో ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని,లేని పక్షంలో పోలీసులకు పట్టించవచ్చని నిందితుడు ఓ లేఖను కూడా ఉంచాడు.

New Update
money

money

అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఓ బాధితుడు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా..తనను క్షమించాలని,డబ్బును ఆర్నెళ్లలో తిరిగి ఇచ్చేస్తానని టైప్‌ చేసి ఉంచిన లేఖను సైతం వదిలి వెళ్లడం గమనార్హం.మధ్యప్రదేశ్‌ లోని ఖర్గోన్‌ జిల్లాల్లో ఓ వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read: ఐదు విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు.. ట్రంప్ సుంకాలకు అలా షాకిచ్చిన యాపిల్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...స్థానికంగా ఓ దుకాణంలో ఆదివారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. నిందితుడు రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.ఈ విషయాన్ని గురించిన యజమాని...ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దుకాణంలో ఓ లేఖ దొరికింది.

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

తాను దొంగతనం చేయాలనుకోలేదని, కానీ ...వేరే మార్గం లేకపోయిందని నిందితుడు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.నేను పొరుగు ప్రాంతంలోనే ఉంటాను. కొంతకాలంగా అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువ అయ్యాయి. రామనవమి రోజు చోరీకి పాల్పడినందుకు క్షమాపణలు.నేను దొంగతనం చేయాలనుకోలేదు.

కానీ వేరే మార్గం లేకపోయింది. అవసరమైనంత డబ్బే తీసుకున్నాను. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను.లేని పక్షంలో పోలీసులకు పట్టించొచ్చు.కానీ ఇప్పుడు మాత్రం ఈ డబ్బు తీసుకుని వెళ్లడం నాకు చాలా ముఖ్యం అని ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుకాణం యజమాని సైతం బ్యాగులో రూ. 2.84 లక్షలు భద్రపర్చగా..అందులో రూ.2.45 లక్షలు కనిపించడం లేదని చెప్పినట్ఉ తెలుస్తుంది.

నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Sharmila fires on YCP :  ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Also Read: Trump's another shock : హెచ్ 1బీ, ఎఫ్1 వీసాదారులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ట్రంప్ మరో షాక్..! హెల్ప్ డెస్క్ సస్పెండ్

 note | madhya-pradesh | madhya pradesh news | apology | steals money | police | letter | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment