Uttarakhand:టన్నెల్ నుంచి కార్మికులను స్ట్రెచర్ మీద ఎలా తీసుకువస్తారో తెలుసా..

ఉత్తరాఖండ్ సిల్క్ యారా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నరాత్రే వాళ్లు బయటకు రావాలి ఉన్నా అది సాధ్యపడలేదు. తాజాగా సొరంగం నుంచి వర్కర్స్ లను స్ట్రెచర్ మీద ఎలా బయటకు తీసుకురావాలో మాక్ డ్రిల్ చేశారు.

New Update
Uttarakhand:టన్నెల్ నుంచి కార్మికులను స్ట్రెచర్ మీద ఎలా తీసుకువస్తారో తెలుసా..

ఉత్తరాఖండ్ సిల్క్ యారా టన్నెల్ లో మొత్తం 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారు లోపలుండగా టన్నెల్ మూసుకుపోయింది. పన్నెండు రోజులుగా వారిని బయటకు తీసుకురావడానికి ఎన్డీఆర్ఎఫ్ ప్రయత్నిస్తూనే ఉంది. నిజానికి వాళ్ళు నిన్న రాత్రే బయటకు రావాలి కానీ దేనితో అయితే సొరంగాన్ని తవ్వుతున్నారో దానికే ప్రాబ్లెమ్ రావడంతో డ్రిల్లింగ్ పనులను ఎక్కడిక్కడే ఆపేశారు. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్‌ మెషీన్‌ అమర్చిన వేదికకు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్‌ మెషీన్‌ అటుఇటూ కదులుతూ కచ్చితమైన దిశలో డ్రిల్లింగ్‌ అవదు. ఎలా పెడితే అలా డ్రిల్లింగ్ చేస్తే అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు.

Also Read:ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్.. ఇలా చేస్తే డబ్బులు మిగులుతాయి..

డ్రిల్లింగ్ ను మళ్ళీ ప్రారంభించడానికి ఏర్పాట్ఉ చేస్తున్నారు. మరోవైపు సొరంగంలో అమర్చిన పైపులో స్ట్రెచర్ ద్వారా కార్మికులను ఎలా తీసుకురావాలి అన్న దాని మీద ఎన్టీఆర్ఎఫ్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఇందులో 800 800 ఎమ్‌ఎమ్‌ వెడల్పు ఉన్న పైపు ద్వారా చక్రాలు ఉన్న స్ట్రెచర్‌ను లోపలికి పంపుతారు. పైపుకు ఇంకో వైపు ఉన్న కార్మికులు దాని మీద బోర్లా పడుకుంటే బయటకు లాగుతారు. తర్వాత వారిని నేరుగా ఆసుపత్రికి తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను ఒక మనిషిని లోపలికి పంపి మరీ టెస్ట్ చేవారు. ఇది విజయవంతంగా అయింది.

మరోవైపు లోపల ఉన్న కార్మికులు ఒత్తిడి అధిగమించకుండా ఉండేందుకు లూడో లాంటి బోర్డ్ గేమ్స్ ను పంపిస్తున్నారు. ప్రస్తుతానికి లోలపల ఉన్నవారంతా బాగానే ఉన్నారని.. యోగా చేస్తూ ఒత్తిడిని అధిగమిస్తున్నారని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment