Health Tips : కడుపుబ్బరం సమస్య వేధిస్తుందా? ఈ చిన్న చిట్కాతో ప్రాబ్లెమ్‌ సాల్వ్!

కడుపుబ్బరం సమస్యలను గ్రీన్‌ టీ దూరం చేస్తుంది. ఇక అజీర్ణతకు కొబ్బరి నీళ్లు మంచి చిట్కా. అటు బొప్పాయి లోని పైపిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం నుంచి ఉపశమనం కలిగించడంలో అరటి పండు అద్భుతంగా పని చేస్తుంది.

New Update
Health Tips : కడుపుబ్బరం సమస్య వేధిస్తుందా? ఈ చిన్న చిట్కాతో ప్రాబ్లెమ్‌ సాల్వ్!

Gastric Problem : కడుపుబ్బరం సమస్య(Gastric Problem) తో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలు(Simple Tips) పాటిస్తే సరిపోతుంది. అజీర్ణంగా ఉన్నప్పుడు అల్లం టీ(Ginger Tea), కొబ్బరినీళ్లు, అరటిపండు, బొప్పాయి, గ్రీన్ టీ తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. వాటిలో ఒకటి జీర్ణక్రియ సమస్య. కొంత మందిలో తరచూ కడుపుబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కడుపుబ్బరంతో బాధపడే వారు ఈ సింపుల్ హోం రెమెడీస్ పాటిస్తే సరిపతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి

అరటి పండు
కడుపుబ్బరం నుంచి ఉపశమనం కలిగించడంలో అరటి పండు(Banana) అద్భుతంగా పని చేస్తుంది. హెవీ ఫుడ్స్ తీసుకున్నపుడు అరటి పండు తింటే త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అంతే కాదు బనానా స్ట్రెస్ బస్టర్ గా కూడా పనిచేస్తుంది. ఆందోళనగా ఉన్నప్పుడు వీటిని తింటే మంచిది.

గ్రీన్ టీ
సహజంగా గ్రీన్ టీ(Green Tea) లోని కేటాచిన్ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ ను తొలగిస్తాయి.

బొప్పాయి
బొప్పాయి(Papaya) లోని పైపిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది. వీటిలోని అధిక ఫైబర్, నీటి శాతం వ్యర్థాలను బయటకు పంపి వికారం , మలబద్దకం సమస్యలను తగ్గిస్తాయి.

అల్లం టీ
అల్లం టీ కడుపులో వికారం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉశమనం కలిగిస్తుంది. అంతే కాదు జీర్ణక్రియ పని తీరును కూడా పెంచుతుంది.

కొబ్బరి నీళ్లు
అజీర్ణతకు కొబ్బరి నీళ్లు(Coconut Water) మంచి చిట్కా . వీటిలో సహజ చక్కెర్లు, ఎలక్ట్రో లైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అజీర్ణత, వికారాన్ని తగ్గించి.. శక్తిని అందిస్తాయి

Also Read : పాకిస్తాన్ లోనూ హోలీ సంబురాలు..అక్కడ ఆ ఆలయంలో హోలికా దహన్..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jammu & Kashmir : జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు గాయపడ్డారు.  వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అమర్‌నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది.  

New Update
J-K's Pahalgam

J-K's Pahalgam

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.  బైసరన్ లోయలో పర్యాటకుల బృందాన్ని  లక్ష్యంగా చేసుకుని  కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో  ఆరుగురు పర్యాటకుల పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ముగ్గురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

విచక్షణారహితంగా కాల్పులు

పహల్గామ్‌లో ట్రెక్కింగ్ కోసం వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. అమర్‌నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది. అమర్‌నాథ్ యాత్ర భద్రత గురించి ప్రశ్నలు తలెత్తాయి. కాగా జమ్మూకాశ్మీర్‌లో పహల్గామ్ టూరిస్ట్ ప్రాంతాలలో ఒకటి, ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు.  ఈ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు.

Also read : ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

Also Read: గూగుల్‌ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

Advertisment
Advertisment
Advertisment