Andhra Pradesh: కత్తులు దూస్తున్న ప్రత్యర్థులు.. ఏపీలో ఈ యుద్ధం ఆగేనా?

ఏపీలో మునపెన్నడూ లేని విధంగా రాజకీయ ప్రత్యర్థులు కత్తులు దూస్తున్నారు. కులాలధిపత్యం కోసం, పార్టీల వర్గపోరులో పైచేయి కోసం జరిగే ఈ రాక్షస క్రీడ మాధ్యలో సామాన్యులు చితికిపోతున్నారు. అక్కడ జరుగుతున్న పొలిటకల్ వార్ గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Andhra Pradesh: కత్తులు దూస్తున్న ప్రత్యర్థులు.. ఏపీలో ఈ యుద్ధం ఆగేనా?

High Tension In AP : తలలు పగులుతున్నాయి.. రక్తం పారుతోంది.. చేతులు, కాళ్లు విరిగిపడుతున్నాయి.. కార్లు మనుషులపైకి దూసుకుపోతున్నాయి.. ఎన్నికల వేళ, ఎన్నికల తర్వాత కూడా ఏపీ(Andhra Pradesh) లో ఈ రకమైన వాతావరణం కనిపించడం చూసి ఏళ్లు దాటిపోయింది. మునపెన్నడూ లేని విధంగా రాజకీయ ప్రత్యర్థులు కత్తులు దూస్తున్నారు. కులాలధిపత్యం కోసం, పార్టీల వర్గపోరులో పైచేయి కోసం జరిగే ఈ రాక్షసాక్రీడలో మాధ్యలో సామాన్యులు చితికిపోతున్నారు. 2024 పోలింగ్‌ తర్వాత ఏపీలో జరుగుతున్న పరిణామాలు పశ్చిమబెంగాల్‌ను తలపిస్తున్నాయి. ప్రతీసారి ఎన్నికల(Elections) వేళ గొడవలు సర్వసాధారణమే అయినా 2024 ఎన్నికల తర్వాత మాత్రం హింస పీక్‌ స్లేజీ దాటినట్టే కనిపిస్తోంది..!

Also Read: పల్నాడులో కొనసాగుతున్న హైటెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్టు

టీడీపీ VS వైసీపీ

టీడీపీ(TDP) నేత భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్‌ నిఖిల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా.. దుండగులు వాహనంతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టడమే కాకుండా..తల పై రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టారు. కొంతకాలం క్రితం లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిలో నిఖిల్‌ కీలక పాత్ర పోషించాడు. ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులే నిఖిల్‌ని హతమార్చేందుకు ఈ దాడి చేశారని భూమా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిచంద్రగిరి నియోజకవర్గంలో, శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై ఆ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఖాళీ బీరు సీసాలు, రాళ్లు, ఇనుప రాడ్‌లతో దాడికి పాల్పడ్డారు. నాని ఛాతీపై పెద్ద రాయితో దాడి చేశారు. ఈ దాడుల్లో నాని గన్‌మ్యాన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మద్దతుదారులు నిరసనలకు దిగడంతో మరింత ఉద్రిక్తత నెలకొంది.

రాళ్ల దాడి

సత్యసాయి జిల్లాలోని తాడిపత్రి వద్ద టీడీపీ, వైసీపీ(YCP) మద్దతుదారులు పరస్పర రాళ్లు విసురుకున్నారు. ఈ రెండు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్‌తో పాటు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు పారామిలటరీ బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అటు సాధారణంగానే రణరంగాన్ని తలపించే పల్నాడు పోలింగ్‌ తర్వాత రక్తం చిమ్ముతోంది. ఇరు వర్గాలు రోడ్లపైకి వచ్చి తన్నుకుంటున్నారు. పరస్పర దాడులు చేసుకుంటున్నారు. మాచర్ల, గురజాలలో ఉద్రికత్త పరిస్థితులు చల్లారలేదు. కొత్తగణేశునిపాడు గ్రామంలో ఇరు వర్గాలు ఇళ్లపై పరస్పర దాడులకు పాల్పడ్డాయి.

Also Read: నూతన నామకరణ మహోత్సవానికి ఆహ్వానం..ముద్రగడ పై మాస్ ట్రోలింగ్‌!

ఇటు అనంతపురంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై వైసీపీ నేతలు రాళ్లదాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలో గర్భిణిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవస్థను ధ్వంసం చేసి పరికరాలకు నిప్పు పెట్టారు. ఇలా ఏపీ అంతా గతంలో ఎప్పుడూ లేని విధంగా హింసను చవిచూస్తోంది. ఈ రాజకీయ నెత్తుటి క్రీడలో సామాన్య జనం నలిగిపోతున్నారు..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!

ఏపీలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.శ్రీకాకుళం,విజయనగరం,ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

New Update
hyd

ఏపీలో వచ్చే మూడు రోజులు పలుజిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. మంగళవారం నుంచి గురువారం వరకూ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని.. ఇలాంటి సమయాల్లో చెట్ల క్రింద నిలబడవద్దని అధికారులు తెలిపారు.

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

ఇక మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్పారు.

Also Read: Golkonda Blue Diamond: వేలంలో ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. దీని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడమే

మరోవైపు వచ్చే మూడు రోజులు ఏపీలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు కోస్తాంధ్ర మధ్య ప్రాంతం, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు.

దక్షిణ కోస్తాలోనూ రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాయలసీమ విషయానికి వస్తే వచ్చే మూడు రోజులు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు అకాల వర్షాలతో పలుచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Karnataka News: చచ్చాడు వెధవ.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు-గంటల వ్యవధిలో ఎన్‌కౌంటర్

Also Read:China: చైనా సంచలన నిర్ణయం.. ఆ ఎగుమతులు నిలిపివేత

srikakulam | vijayanagaram | prakasam | ap-weather | AP Weather Alert | AP Weather Latest Update | ap weather news | ap weather today | ap weather updates | ap weather update today

Advertisment
Advertisment
Advertisment