IPL 2024: పంత్ కు భారీ పెనాల్టీ విధించాలి..మాజీ క్రికెటర్

రిషబ్ పంత్‌ వ్యవహార శైలిపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ గిల్ క్రిస్ట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ మధ్యలో అంపైర్ తో పంత్ వాగ్వాదం దిగటం పై భారీగా పెనాల్టీ విధించాలని బీసీసీఐని గిల్ క్రిస్ట్ డిమాండ్ చేశాడు.

New Update
IPL 2024: పంత్ కు భారీ పెనాల్టీ విధించాలి..మాజీ క్రికెటర్

ఐపీఎల్ 2024 (IPL 2024) లో ఢిల్లీ క్యాపిటల్ రెండో విజయం సాధించింది. శుక్రవారం లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపజర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ముందు బ్యాటింగ్‌ చేసిన లక్నో టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 స్కోర్ చేసింది. ఈ టార్గెట్‌ను ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేజింగ్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో విన్నింగ్ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్‌ వ్యవహార శైలిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్ట్రిస్ట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పంత్‌కు పెనాల్టీ విధించాలని బీసీసీఐని డిమాండ్ చేశాడు.

లక్నో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాలుగో ఓవర్‌లో, పంత్ ఆన్-ఫీల్డ్ అంపైర్‌తో చాలాసేపు ఏదో విషయంపై చర్చించాడు. ఇషాంత్ శర్మ దేవదత్ పడిక్కల్‌కి వేసిన డెలివరీకి పంత్ వైడ్-బాల్ రివ్యూ తీసుకున్నాడు. ఈ రివ్యూ ఢిల్లీకి వ్యతిరేకంగా వచ్చింది. దీంతో పంత్ కోపంగా కనిపించాడు. అసలు తాను రివ్యూ కాల్ ఇవ్వలేదని ఢిల్లీ కెప్టెన్ అంపైర్లతో వాగ్వాదానికి దిగినట్లు కనిపించింది. అయితే ఇషాంత్ బాల్ వేయగానే, రిషబ్ ‘T’ సైన్‌తో రివ్యూ కోరినట్లు రీప్లేలో కనిపించింది.

“అంపైర్లు ఏ ఫార్మాట్‌లో అయినా గేమ్‌పై మరింత కంట్రోలింగ్ తీసుకోవాలి. ఆటను ముందుకు తీసుకెళ్లడానికి వారు ఇంకా బెటర్‌గా పని చేయాలి. రిషబ్ రివ్యూ కోరాడా లేదా అనే వివాదం నెలకొంది. సరే, రివ్యూ కాల్‌పై మిస్‌కమ్యూనికేషన్ ఉందనుకుందాం. కానీ పంత్, అంపైర్ అక్కడే నిలబడి 3-4 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఇది చాలా చిన్న విషయం. అంత పెద్ద కన్వర్జేషన్ అవసరం లేదు. రిషబ్ ఎంత బలంగా కంప్లైంట్ చేసినా లేదా మరే ఇతర ఆటగాడు ఫిర్యాదు చేసినా, అంపైర్లు ‘అయిపోయింది’ అని చెప్పాలి, త్వరగా ముందుకు సాగాలి. కానీ ప్లేయర్ అలాగే మాట్లాడటం కొనసాగిస్తే మాత్రం, వారికి జరిమానా విధించాలి” అని గిల్‌క్రిస్ట్ చెప్పాడు.అయితే ఇషాంత్ వేసిన ఆ బాల్, పడిక్కల్ బ్యాట్‌ను దాటి వెళ్లినప్పుడు అవుటర్ ఎడ్జ్ తీసుకుందో లేదో చెక్ చేయడానికి స్నికోమీటర్‌ ఉపయోగించలేదని, దీనిపై పంత్‌కు కోపం వచ్చిందని కామెంటేటర్స్ పోమ్మీ ఎంబంగ్వా, దీప్ దాస్‌గుప్తా ఆ తర్వాత స్పష్టం చేశారు. ఆ తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పంత్ రెచ్చిపోయాడు. కేవలం 24 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లతో 41 పరుగులు చేసి, ఢిల్లీ గెలుపుకు బాటలు వేశాడు. దీంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ 168 పరుగులను ఛేదించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

New Update
Jammu Kashmir

Jammu Kashmir

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమైనట్లు అధికారులు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్లు సమాచారం.

Also Read:BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

జమ్మూ కశ్మీర్‌ లో పని చేసే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా అక్కడ పని చేస్తున్న రైల్వే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లినవారే.దీంతో దాడుల ముప్పు దృష్ట్యా రైల్వే భద్రతా సిబ్బంది తమ బ్యారక్‌ ల నుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read: Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

మరోవైపు కశ్మీరీ పండిట్‌ల లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.వీరితో పాటు శ్రీనగర్‌,గాందెర్బల్‌ జిల్లాల్లోని పోలీసు సిబ్బందికి కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉదన్న వార్తల నేపథ్యంలో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి.

రైల్వే ప్రాజెక్టులను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆర్పీఎఫ్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

Also Read:Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

Also Read: Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?

jammu-kashmir | jammu kashmir attack | latest-news | latest-telugu-news | latest telugu news updates | attack in Pahalgam | Pahalgam attack | army

 

Advertisment
Advertisment
Advertisment